క్రైమ్/లీగల్

కోరుట్లలో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, మార్చి 5: కోరుట్ల పట్టణంలోని శ్రీనివాస్ రోడ్డులో పాఠశాలకు వెళ్తున్న బి. నందిశ్వర్ అనే అనాథ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన సోమవారం కోరుట్లలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం జవహార్ రోడ్డులోని శ్రీమాతృ సేవా సమితి అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆవాసంలో ఉంటూ ప్రగతి పాఠశాలలో 8వతరగతి చదువుతున్న నందిశ్వర్ ఉదయం పాఠశాలకు వెల్తుండగా, మార్గమద్యంలో గుర్తు తెలియని వ్యక్తి ఏ బాబు అని పిలవడంతో విద్యార్థి వెనక్కి తిరిగి చూడగా, గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో సృహా తప్పి పడిపోయిన విద్యార్థిని గమనించిన స్థానికులు వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆవాసం నిర్వాహకులు వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఎస్సై బేగ్ ఘటన స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. కాగా ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో సరిగ్గా ఇంటర్ పరీక్షల సమయంలోనే అప్పుడు బాలికపై ఇలాంటి ఘటనే చోటు చేసుకోగా, ఇంతవరకు నిందితుల అచూకి లభ్యం కాలేదు. మరోసారి అదే తరహాలో సంఘటన చోటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా పోలీసులు ఈ ఘటనపై సమగ్రంగా విచారించాలని కోరుతున్నారు.