క్రైమ్/లీగల్

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపూర్, మార్చి 19: మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన తాడవేని నాగరాజు (24) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ తెలిపిన వివరాల ప్రకారం..నాగరాజుకు తల్లి అనారోగ్యంతో ఉండగా, తండ్రి ఏమీ పని చేయకపోగా కుటుంబ భారం మృతుడు నాగరాజుపై పడింది. అలాగే చెల్లి పెళ్లీడుకొచ్చిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే మనోవేదనతో ఎవరు లేని సమయంలో వారి ఇంటి ముందు రేకుల షెడ్డుకు పైపుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెల్లి పెండ్లి, తల్లి అనారోగ్యం, తండ్రీ ఏమీ పని చేయకపోవడం, ఎలాంటి ఆస్థులు లేకపోవడమే కారణంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి కొమురయ్య సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎక్లాస్‌పూర్ గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

తేనేటీగల దాడిలో రిటైర్డ్ ఉద్యోగి మృతి
హుస్నాబాద్, మార్చి 19: హుస్నాబాద్ మండల కూచనపల్లి గ్రామానికి చెందిన మంద లక్ష్మారెడ్డి (80) రిటైర్డ్ ఉద్యోగి తేనేటీగల దాడిలో మృతిచెందాడు.సోమవారం కూచనపెల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మారెడ్డి సోమవారం తన ఇంటి నుండి బైటికి వెళ్తుండగా ఒక్కసారిగా తేనేటిగలు దాడి చెయడంతో సృహతప్పి పడిపోగా వెంటనే కుటుంబ సభ్యులు గ్రామంలో ప్రథమ చిక్సిత చేసి మేరుగైన వైద్యం కోసం సిద్దిపేటకు తరలించారు. చికిత్స పొందుతు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు భార్య ఉన్నారు.

ఈతకు వెళ్లిన బాలుడి మృతి
మల్యాల, మార్చి 19:ఆదివారం సెలవు కావడంతో ఇంట్లో నుండి అడుకోవడానికి వెల్తున్నాని చెప్పి ఈతకు వెల్లిన బాలుడు శవమై తేలడంతో అకుంటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. మల్యాల ఎస్సై నీలం రవి కథనం ప్రకారం మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన బండారి జశ్వంత్ (10) అనే 3వతరగతి చదువుతున్న బాలుడు ఆదివారం సెలవుదినం కావడంతో ఆడుకోవడానికి వెల్తున్నానని చెప్పి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లలో పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికి ఫలితం లేకపోయింది. సోమవారం సమీప పంట పోలాల వ్యవసాయ బావులో బాలుడు మృతి చెందడంతో బంధువులు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలం రవి వెల్లడించారు.