కరీంనగర్

నేటి మినీ మాహానాడును విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, మే 21: కరీంనగర్ నగర శివారు రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి గార్డెన్‌లో మంగళవారం నిర్వహించనున్న టీడీపీ మినీ మాహానాడుకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపల్లి మండలం రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినీ మాహానాడు సమావేశంలో అమలుకు నోచుకొని హామీలు, వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య, సాగునీరు, రైతులు, బడ్జెట్ కేటాంయింపులో అంకెల గారెడి తదితర అంశాలపై తీర్మాణాలు చేసి రాష్ట్ర కమిటి, కేంద్ర కమిటీకి పంపిస్తామని తెలిపారు. మినీ మహానాడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుందని, ఈ సందర్భంగా కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం నుండి రేకుర్తిలోని మహానాడు ప్రాంగణం సాయి మహాలక్ష్మి గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో పలు తీర్మాణాలు చేస్తామని తెలిపారు. మినీ మాహానాడుకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణతోపాటు నాయకులు పెద్దిరెడ్డి, బి.ఎన్.రెడ్డి, బుచ్చిలింగం, రాజునాయక్, నర్సిరెడ్డిలు హజరుకానున్నట్లు వివరించారు. మాహానాడుకు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇంచార్జులు ఎడ్ల వెంకటయ్య, జాడి బాల్‌రెడ్డి, జిల్లా, మండల నాయకులు శివరామక్రిష్ణ, గాజే రమేష్, నాగుల బాలాగౌడ్, తీగుట్ల రమేష్, రాజేశం, మిట్టపల్లి శ్రీను. కరుణాకర్‌రెడ్డి, దాసరి ప్రవీణ్, గజ్జెల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.