కరీంనగర్

టీచర్ ట్రేనింగ్ సెంటర్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జూన్ 19: పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి పలుఅభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రూ. 20లక్షలతో నిర్మించే టీచర్ ట్రేనింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లికి 1మహిళా రెసిడెన్షియల్ కళాశాలను మంజూరు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల ప్రహారీ గోడల నిర్మాణానికి రూ. 3కోట్ల నిథులు మంజూరు చేయాలని మంత్రులను కోరారు. ఈకార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్‌టీఎస్ చైర్మన్ రాకేష్‌కుమార్, ప్రభుత్వ చీప్‌విఫ్ రాష్ట్ర శాసనమండలి పాతూరి సుధాకర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ రాజయ్య, మార్కెట్ చైర్మన్ అనిల్, ఎంపిపిలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిథులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.