కరీంనగర్

పవర్‌లూం కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 22: పట్టణంలో అల్లె సత్యనారాయణ (46) అనే పవర్‌లూం కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు గురువారం రాత్రి సిలిండర్‌ను పేల్చి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే ఇంటిలో ఒక గది మాత్రం పేలిపోయి ఆయన సజీవంగానే ఉన్నాడు. దీనితో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ప్రమాద సంఘటన నుంచి సత్యనారాయణను బయటకు తీసారు. పోలీసులు సత్యనారాయణను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి విచారించి పంపారు. అతని భార్య వేరొక ఇంటిలోకి వసతి ఏర్పాటు చేసుకుంది. అయతే, శుక్రవారం ఖాళీగా ఉన్న మరమగ్గాల షెడ్‌లో నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ గతంలో పవర్‌లూం ఆసామిగా జీవనం సాగించాడు. పరిశ్రమ సంక్షోభం, తాగుడుకు బానిస అయిన కారణాలతో అప్పుల పాలై తనకున్న ఎనిమిది మరమగ్గాలను ఇటీవలే అమ్ముకున్నాడు. అనంతరం పవర్‌లూం కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పటికి రూ.4 లక్షల వరకు అప్పులు పేరుకుపోయినట్టు తెలిసింది. మృతుని భార్య రమ్య బీడీ కార్మికురాలిగా పనిచేస్తుండగా, కుమారులు రాహుల్ (12), అజయ్ (6) ఉన్నారు.