కరీంనగర్

కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, నవంబర్ 13: శుష్క వాగ్దానాలతో ప్రజలను మోసగించిన టీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకతే మహాకూటమిని గెలిపిస్తుందని మాజీ సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండలంలోని అర్పపెల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండబెట్ల వరుణ్‌కుమార్ అనే యువకుడు జీవన్‌రెడ్డి ఎన్నికల ఖర్చుకు గానూ రూ.25వేల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రజలతో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలను వంచనకు గురిచేసిన కేసీఆర్ మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని జీవన్‌రెడ్డి అన్నారు.అబద్దపు వాగ్దానాలతో నియంతపాలన సాగించి ప్రజలను అణగదొక్కేందుకు ప్రయత్నించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ కూటమి ముందుకు వెళ్లేందుకు దోహదపడుతుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బహుజన ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చేలా పాలన కొనసాగిస్తామని అన్నారు.