కరీంనగర్

ఎస్సారెస్పీ జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్‌పల్లి, నవంబర్ 18 : ఎస్సారెస్పీ వరద కాలువజలలాతో తెలంగాణ పల్లెలను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ అపద్ధర్మ మంత్రి ఈటల రాజేంధర్ అన్నారు. ఆదివారం మెట్‌పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కోరుట్ల నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు ఈటల రాజేంధర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ శాసనసభపక్షనేతగా ఉన్న తాను వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి 12గంటలు కరెంటు ఇవ్వాలని అడిగితే ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు.ఆనాడు తెలంగాణ పల్లెల్లో అర్ధరాత్రి కరెంటు వస్తే రైతులు రాత్రిపూట కష్టపడుతూ వెళ్లి పంటలకు నీరు పెట్టే పరిస్థితి ఉండేదని అన్నారు. ఉద్యమం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు 24గంటలు కరెంటు ఇస్తున్నామని ఈటల రాజేంధర్ అన్నారు.బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్టల్రోగానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోగాని, రైతాంగానికి 24గంటలు కరెంటు ఇవ్వడం లేదన్నారు.మిషన్‌భగీరథ,కల్యాణలక్ష్మి,షాదీముబారక్,రైతుబంధు,రైతుబీమా వంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే ప్రజల బతుకులు బాగుచేసేందుకు కృషి చేస్తున్నట్టు అపద్ధర్మ మంత్రి ఈటల రాజేంధర్ పేర్కొన్నారు.ఓట్ల కోసం చిల్లర పార్టీలు కూటమికట్టి ప్రజలవద్దకు వస్తున్నారని విజ్ఞతకలిగిన ప్రజలు అలాంటి కూటమిని చీకొట్టే పరిస్థితి వచ్చిందని ఈటల రాజేంధర్ విమర్శించారు.ప్రజల సంక్షేమాన్ని చూసే టీఆర్‌ఎస్ పార్టీ కోరుట్ల అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును భారీమెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఈటల కోరారు.అనంతరం టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ అడగకుండా వరలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మరోమారు సేవచేసే అవకాశమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థచైర్మన్ చంద్రశేఖర్‌రావు,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్‌రావు,మెట్‌పల్లి కోరుట్ల మున్సిపల్ చైర్మన్‌లు మర్రి ఉమారాణి,శీలం వేణు,టీఆర్‌ఎస్ నాయకులు బర్లసాయన్న,బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, మాడిశెట్టి ప్రభాకర్, డాక్టర్ సత్యనారాయణ, మార్గం గంగాధర్,లింగంపెల్లి సంజీవ్,టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు,వివిధ గ్రామాల నుంచి టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

* రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి
సుల్తానాబాద్, నవంబర్ 18: భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలంతా బిజెపికి ఓటు వేసి ఆశీర్వదించాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో పెద్దఎత్తున ర్యాలీ, ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. తాను ఎమ్మెల్యేగా చేసిన హయాంలో ఎన్నో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తానని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మీస అర్జున్ రావు, కడారి అశోక్ రావు, సంజీవ రెడ్డి, కోట రాంరెడ్డి, మండల అధ్యక్షుడు కొమ్ము తిరుపతి, చౌదరి మహేందర్, మల్లిఖార్జున్, రమేష్, సదయ్య, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, డప్పుచప్పుళ్లతో కళాకారులు, కోలాటాలతో మహిళలు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఖనంగా స్వాగతం పలికారు.