కరీంనగర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు.. సిద్ధం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 18: 2018-19లో జరుగనున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఆర్‌డిఓలతో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2018 నవంబర్ 6వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని తెలిపారు. 2018 నవంబర్ 6వ తేదీ తరువాత ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచాలని, 2019 జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించాలని, ఆ తదుపరి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఓటరు జాబితాలో పొందుపరచాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదుకోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 20 లోగా విచారణ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తుల వివరాలను ఆయా జిల్లాల్లోని డివిజన్ల ఆర్‌డిఓల నుంచి కలెక్టర్ తీసుకున్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, మెట్‌పల్లి, బెల్లంపల్లి సబ్ కలెక్టర్లు రాహుల్, గౌతమ్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఆర్‌డిఓలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగికి రెండేళ్ల జైలు
కరీంనగర్ (లీగల్), డిసెంబర్ 18: ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే లంచం తీసుకుంటూ పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లోక వేణుగోపాల్ (53)కు కరీంనగర్ ప్రత్యేక ఎసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన కోరి సత్యనారాయణ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో ఎస్‌టిడి టెలీఫోన్ బూత్, జిరాక్స్ సెంటర్‌ను నిర్వహిస్తుండేవాడు. 2009 వరకు టెండర్ గడువు ముగియడంతో 2010లో టెండర్‌ను నిర్వహించారు. ఆయా టెండర్‌లో సత్యనారాయణ షీల్డ్ కవరణలో టెండర్ వేయగా కేవలం ఒకటే టెండర్ రావడంతో ఆయా టెండర్‌ను రద్దు చేశారు. దీనిపై వికలాంగుడైన సభ్యురాలైన తనకు టెండర్ ఇప్పించాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. 10.11. 2010న ఆసుపత్రిలోని సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న లోక వేణుగోపాల్‌ను కలువగా కలెక్టర్ ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పత్రాలను ఇప్పించాలని కోరాడు. ఇందుకుగాను పది వేల రూపాయల లంచం ఇస్తేనే ఆయా పత్రాలను మంజూరు చేస్తానని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేని సత్యనారాయణ 12.11.2010న ఎసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో పథకం ప్రకారరం ఎసీబీ అధికారులు వల పన్ని నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. తగిన సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్ రావు నిందితుడైన వేణుగోపాల్‌పై నేరం రుజువు కావడంతో రెండు సంవత్సరాల కఠిన కారాగారపు జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కాగా, నిందితుడైన లోక వేణుగోపాల్ కామారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో సీనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం
- ఎమ్మెల్యే సుంకె రవి శంకర్
గంగాధర, డిసెంబర్ 18: రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. గంగాధర వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ధాన్యం కుప్పలను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు తీసుకువచ్చిన ధాన్యం తడుస్తుందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు రైతులకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకూడదని, ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ఆదుకోవడంతో పాటు త్వరితగతిన డబ్బులు తమ ఖాతాలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.