కరీంనగర్

మేడిగడ్డ, కనె్నపల్లిని సందర్శించిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 1:రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సందర్శించి సాయంత్రం 6గంటలకు కరీంనగర్ తీగెల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఉమ్మడి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకు చేరుకొని పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం కనె్నపల్లి పంప్‌హౌజ్‌కు చేరుకొని అక్కడ పనులు పరిశీలించి అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. సాయంత్రం 6గంటలకు హెలికాప్టర్ ద్వారా నగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పలువురు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్ వెంట సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ ఉన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ రాజేందర్‌రావు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, సంకె రవిశంకర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, టెఫ్క్ఫా చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, వి. మోహన్‌రెడ్డి, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ జీ.వీ. శ్యామ్ ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్లు ప్రావీణ్య, రాజర్షిషా, పోలీస్ కమిషనర్ వీ.బీ. కమలాసన్‌రెడ్డి, జడ్పీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌కు మంగళవారం ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఆయన రాత్రి జిల్లా కేంద్రంలో బస చేసేందుకు ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా నేటి ఉదయం 10గంటలకు జగిత్యాల జిల్లా రాజేశ్వర్‌రావుపేట, రాంపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న పంప్‌హౌజ్ పనులు పరిశీలించనున్నారు.
మోగిన పంచాయతీ నగారా
* పల్లె పోరుకు షెడ్యూలు విడుదల
* జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు
* మొదటి విడత ఈనెల 7, రెండో విడత 11,
మూడో విడతకు 16న నోటిఫికేషన్ విడుదల
* గ్రామాల్లో కూసిన ఎన్నికల కోడ్
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 1: ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ నగారా ఎట్టకేలకు కొత్త ఏడాది మొదటిరోజున మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేయటంతో, ఎన్నికల కోడ్ కూయగా, పల్లె పోరు మొదలైంది. జిల్లాలోని 313 గ్రామపంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా, నోటిఫికేషన్‌లు విడుదలైన నాటినుంచే నామినేషన్లు కూడా స్వీకరించనున్నారు.
జనవరి 7న తొలిదశ నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆరోజు నుంచి, ఈనెల 9వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 10న స్క్రూటినీ, 11న ఉపసంహరణ, 21న పోలింగ్, మధ్యాహ్నం లెక్కింపు, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.
అలాగే, రెండో విడతగా ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నామినేషన్లకు తుదిగడువు ఈనెల 13కాగా, 14న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ, 25న పోలింగ్, మధ్యాహ్నం 2గంటల నుంచి లెక్కింపు, అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు. 16న మూడో విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు18గా నిర్ణయించారు. 19న పరిశీలన, 20వ తేదీన ఉపసంహరణ, ఈనెల 30న పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి, ఆతర్వాత ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపుచేసి, అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనుండగా, మొదటిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటాకు స్థానం కల్పించారు. మొదటి విడతగా చొప్పదండి మండలంలోని 16 గ్రామాలు, గంగాధర మండలంలోని 33, కరీంనగర్ రూరల్ మండలంలోని 17, కొత్తపల్లి మండలంలోని 8, రామడుగు మండలంలోని 23గ్రామాలతోకలిపి 97పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. రెండోవిడత చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాలు, గనే్నరువరం మండలంలోని 16, తిమ్మాపూర్ మండలంలోని 23, మానకొండూర్ మండలంలోని 27, శంకరపట్నం మండలంలోని 24 గ్రామాలతో కలిపి 107 పంచాయితీల్లో, మూడో విడతగా ఇల్లందకుంట మండలంలోని 18, జమ్మికుంట మండలంలోని 20, హుజురాబాద్ మండలంలోని 19, వెనె్కపల్లి సైదాపూర్ మండలంలోని 26, వీణవంక మండలంలోని 26గ్రామాలు కలిపి 109 పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.పంచాయితీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావటంతో పల్లెల్లో రాజకీయ వేడి పెరిగింది. పల్లెపీఠంపై ఆసీనులయ్యేందుకు ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, కుర్చీని చేజిక్కించుకునేందుకు వ్యూహ,ప్రతివ్యూహాలు పన్నడం గ్రామాలల్లో మొదలైంది.
కరీంనగర్ కమిషనరేట్‌లో..
హైవే పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభం

కరీంనగర్, జనవరి 1: కరీంనగర్ కమిషనరేట్‌లో మంగళవారం హైవే పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభమయ్యాయి. పోలీస్ పరేడ్ గ్రౌండులో ఏర్పాటైన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డితో కలిసి హైవే పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. హైవే పెట్రోలింగ్ నిర్వహణకు కరీంనగర్ కమీషనరేట్‌కు మూడు వాహనాలు మంజూరయ్యాయి. ఈ వాహనాలు ఒకటి రాజీవ్ రహదారిలో, మరో రెండు వరంగల్, జగిత్యాల రహదారుల్లో రేయింబవళ్లు పెట్రోలింగ్‌లను నిర్వహిస్తాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రమాదాల నియంత్రణకు ఈ పెట్రోలింగ్‌లను నిర్వహిస్తున్నారు. ఏదైనాప్రమాదంజరిగిన సమాచారం అందిన వెంటనే ఈ వాహనాల్లో పనిచేసే అధికారులు 108, ఇతర అంబులెన్స్‌లకు సమాచారం అందించి సత్వరం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంలో గాయపడిన బాధితులను అంబులెన్స్‌ల కోసం ఎదురుచూడకుండా ఒక గంట వ్యవధిలో మెరుగైన వైద్యసదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నియమనిబంధనలను పాటించాలన్నారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించక వాహనాలను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపడం వల్లనే ఎక్కువశాతం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వాహనదారులు రక్షణ కోసం సీటుబెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు. పోలీసులు తనిఖీల సందర్భంగా పట్టుకుంటారనే భయంతోనే తనిఖీలు ఉన్న ప్రాంతాల్లో సీటుబెల్ట్, హెల్మెట్‌లను ధరిస్తున్నారని, ఇది సరైందికాదని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోలింగ్ వాహనాల్లో విధులను నిర్వహించే పోలీసులు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉందని గుర్తించిన ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. పెట్రోలింగ్ నిర్వహణ సందర్భంగా రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా నిలిచి ఉన్న వాహనాలను రోడ్డుకు కింది భాగంలో దింపి, బ్లింకింగ్ లైట్లను వేయించాలని సూచించారు. గత సంవత్సరం కమిషనరేట్‌లో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు ఎక్కువ రక్తస్రావం జరుగకుండా ప్రథమ చికిత్స చేసి ఒక గంట వ్యవధిలోపు మెరుగైన ఆసుపత్రుల్లో చేర్పించినట్లయితే 50 శాతం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను రక్షించవచ్చని చెప్పారు. పెట్రోలింగ్ వాహనాల విధులను నిర్వహించే పోలీసులు అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ పేరు ప్రతిష్టలను పెంపొందించాలని కోరారు. విధి నిర్వహణను సంతృప్తికరంగా కొనసాగించాలన్నారు. బాధ్యతలు విస్మరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్.శ్రీనివాస్ (పరిపాలన), పి.సంజీవ్ కుమార్ (లా అండ్ ఆర్డర్), విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్‌పి జె.రామారావు, ఏసీపీలు డాక్టర్ పి.అశోక్, శ్యామ్‌సుందర్, శోభన్ కుమార్, టి.కృపాకర్, రాగ్యానాయక్‌లతో పాటుగా పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.