కరీంనగర్

నేటి నుంచి మానసిక వైద్యుల రాష్టస్థ్రాయి సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 13: భారత మానసిక వైద్యమండలి ఆధ్వర్యంలో శనివారం నుంచి నగరంలో మానసిక వైద్యుల రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక మండలి అధ్యక్షుడు డా.కె.్భగ్యరెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించే ఈసదస్సులో 5రాష్ట్రాలనుంచి జాతీయస్థాయి వైద్యులు పాల్గొని, ప్రతి వందమందిలో ఒకరికి సంక్రమిస్తున్న ష్కిజోప్రీనియా మానసిక వ్యాధిపై చర్చించనున్నట్లు వెల్లడించారు. మానసికశాస్త్రంలో పేరెన్నికగల ప్రముఖ వైద్యులు డా.రఘురాంరెడ్డి, డా. అశోక్‌రెడ్డి, డా. ఉదయభాను, డా. ఆనంద్, డా.వర్గీస్, డా.జార్జీ, తదితరులు పాల్గొని మానసిక రుగ్మతలు రూపుమాపటంలో అవలంబించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈసమావేశంలో మానసిక వైద్యులు డా.కిషన్, డా.వి.జార్జిరెడ్డి, డా. ఎం.ప్రవీన్‌కుమార్‌లతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు.