కరీంనగర్

ఆర్టీసి బస్సు-లారీ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్కతుర్తి, మే 13: ఎల్కతుర్తి మండల కేంద్ర సమీపంలో ఆర్టీసి బస్సు-లారీ ఢీకొని 20 మందికి గాయాలైనట్లు ఎల్కతుర్తి పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..శుక్రవారం ఉదయం 3 గంటలకు ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో ఆర్టీసి బస్సు నంబర్ ఎపి.01జడ్.0089, లారీ నంబర్ ఎపి.16టివై.9075 నందిగామ నుండి సిర్‌పూర్ కాగజ్‌నగర్ వైపు ఆర్టీసి బస్సు ఆదిలాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్తుండగా ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలైనట్లు, వీరిని వెంటనే 108లో వరంగల్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ కాలగోట్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

*