కరీంనగర్

గుర్తు తెలియని వాహనం ఢీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్కతుర్తి, మే 26: మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సెంట్ థామస్ పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సుకుమార్ (25), హన్మకొండ మండలం కడిపికొండకు చెందిన సురాయిల అనీల్ (23)గా పోలీసులు గుర్తించారు. కాజీపేటకు చెందిన సుకుమార్ తన పెద్దనాన్న మునిగడప మల్లయ్య ఇంటి దగ్గర 20 ఏళ్ల నుండి ఉంటుండగా, అనీల్ కుమార్ వాళ్ల చిననాన్న అయిన సమ్మయ్య దగ్గర పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సుకుమార్ అనీల్‌ను తీసుకొని బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం సుకుమార్ అన్న టిఆర్‌ఎస్ నాయకుడు మునిగడప శేషు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని, శవాలను పోస్టుమార్టంకై హుజూరాబాద్‌కు పంపి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుకుమార్, అనీల్ ఇద్దరు అవివాహితులు కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.