జాతీయ వార్తలు

దేవెగౌడ హయాంలో ఒక్క ఉగ్రదాడి లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: తన తండ్రి దేవెగౌడ పదినెలలు ప్రధానిగా పనిచేసిన కాలంలో దేశంలో ఒక్క ఉగ్రదాడి కూడా జరుగలేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌పై జరిగిన మెరుపుదాడులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం సిగ్గుచేటని అన్నారు. పాకిస్థాన్‌పై తానే బాంబు దాడులకు పాల్పడినట్లు మోదీ చెప్పుకుంటున్నారని అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు ప్రధాని మోదీ కల్పిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ప్రజల కోరిక మేరకే తన కుటుంబ సభ్యులు పోటీచేస్తున్నారని అన్నారు. మంఢ్యలో సుమలత పోటీని పెద్దదిగా మీడియా చూపించిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాదని, రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. రాహుల్ ప్రధాని మంత్రి అయితే అవసరమైతే తన తండ్రి సలహాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.