కర్నూల్

నంద్యాల ఉపఎన్నిక.. ముస్లిం అభ్యర్థి కోసం వైకాపా అనే్వషణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 15: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో వైకాపా తరపున ముస్లిం అభ్యిర్థిని బరిలో నిలుపాలని పార్టీ అధిష్టానం అనే్వశిస్తున్నట్లు తెలిసింది. గతంలో కూడా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం నంద్యాల అసెంబ్లీ ఇన్‌చార్జి బాధ్యతలను ముస్లిం అభ్యర్థికి అప్పగించాలని పట్టణంలోని ఓ విద్యావేత్తను పలుమార్లు సంప్రదించిన విషయం విధితమే. వైకాపాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు అప్పట్లో నంద్యాలకు వచ్చి ముస్లిం విద్యావేత్తతో పలుమార్లు సంప్రదింపులు జరుపడం, ఆయన ఇన్‌చార్జి బాధ్యతలకు నిరాకరించడం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో అనివార్యమైన ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి ఏక గ్రీవంగా ఇవ్వాలని వైకాపా ఒక వైపు వాదిస్తుండగా, తెలుగుదేశం పార్టీ టికెట్ నాకంటే నాకని నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రస్తుతం వైకాపా నంద్యాల ఇన్‌చార్జిగా పనిచేస్తున్న యువకుడు, ఉత్సాహవంతుడైన మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానానికి సమాచారం ఇస్తున్నప్పటికీ వైకాపా మాత్రం ముస్లిం అభ్యర్థి కోసం అనే్వశిస్తున్నట్లు తెలిసింది. నంద్యాల అసెంబ్లీ స్థానానికి గతంలో ఎస్‌బి నబీసాహెబ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ కూడా మూడు సార్లు నంద్యాల అసెంబ్లీ నుండి గెలిచి పలు పదవులు పొందారు. అలాగే ఇతర పార్టీల తరపు నుండి కూడా ముస్లిం అభ్యర్థులు పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మగ్బుల్ హుసేన్ నంద్యాల అసెంబ్లీకి పోటీ చేయగా మరికొంత కాలానికి మాజీ మున్సిపల్ చైర్మన్ డా. ఎస్‌ఎండి నౌమాన్ కూడా అసెంబ్లీకి పోటీ చేశారు. ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ పరిధిలో ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు ఆర్థిక స్థోమతతో పాటు అంగబలం, కార్యకర్తలు, అనుచరుల బలం ఉన్న నేతలు ఉన్నారు. విద్యావేత్తకు అన్ని రకాల హంగులు ఉన్నప్పటికి ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు వెనుకా, ముందు ఆలోచిస్తున్నారు. అలాగే ఎపిపిఎస్‌సి బోర్డు మెంబరుగా పనిచేసిన డా. ఎస్‌ఎండి నౌమాన్ కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్న వ్యక్తి. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, పదవులను అధిష్టించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ కూడా వైకాపాలోకి వెళ్లాలా, లేక తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలా అన్న విషయంపై ఊగిసలాగ ధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన అనుచరులు సమావేశమై తమ నాయకునికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎంపిక చేయాలని, లేనిపక్షంలో నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్‌ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రెండు సార్లు నంద్యాల పార్లమెంటుకు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికి నిరుత్సాహం చెందక తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు ఏదోరకంగా ఎమ్మెల్సీగా నైనా ఎంపిక చేస్తుందన్న ఆశతో ఉన్నారు. ఇదే సమయంలో ఎన్‌ఎండి ఫరూక్‌తో కూడా వైకాపా నేతలు ఆ పార్టీలోకి వచ్చేందుకు సంప్రదింపులు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఫరూక్ కుమారులు వైకాపాలోకి వెళ్లేందుకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో వైకాపా టికెట్ ముస్లిం అభ్యర్థికి ఇస్తారా? లేక ఇన్‌చార్జిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డికి ఇస్తారా? అన్న విషయంపై రాజకీయ విశే్లషకులు అంచనాలు వేస్తున్నారు.