కర్నూల్

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ణగిరి, సెప్టెంబర్ 21:రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామాల అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని ఆ పార్టీ పత్తికొండ ఇన్‌చార్జి కంగాటి శ్రీదేవి తెలిపారు. మండల పరిధిలోని బి.ఎర్రబాడు గ్రామంలో శుక్రవారం గడప గడపకూ వైసీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను తాము పూర్తి చేశామని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ రూపొందించిన నవరత్నాలు పథకం దేశంలోనే అత్యుత్తమమైనవన్నారు. గ్రామాల్లో నేటికీ పింఛన్లు, రేషన్‌కార్డులు అందడం లేదని, పింఛన్ల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారం చేపట్టి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వెంకటారాముడు, నాయకులు నక్కా నాగరాజు, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, రంగనాయకులు, రామచంద్రుడు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.