కర్నూల్

చంద్రబాబుకు బుద్ధి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, సెప్టెంబర్ 24:ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంటింటికీ వైసీపీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే బుగ్గన పట్టణంలోని తారకరామనగర్‌లో పర్యటించి ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు, మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందేమీ లేదని విమర్శించారు. అంతేగాక రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు సేకరించి దోచుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, రైతుల భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు గత నాలుగేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి రావాలని తెలిపారు. జగన్ చేపట్టనున్న నవరత్నాలు పథకం పేద ప్రజలకు ఓ వరమన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్‌కు అండగా నిలవాలని బుగ్గన కోరారు.