కర్నూల్

అహోబిలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, డిసెంబర్ 18:నల్లమల అరణ్యంలో వెలసిన 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన, జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచి వైష్ణవ క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీఅహోబిల క్షేత్రంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ ఈఓ కామేశ్వరమ్మ , జీపీఏ సంపత్, ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో వేడుకలు కన్నుల పండువలా జరిగాయి. ఎగువ, దిగువ అహోబిలాల్లో వెలసిన శ్రీజ్వాలానరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను, శ్రీప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించి పట్టుపితాంబరాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే ఉత్సవమూర్తులను వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. గోదాదేవి, శ్రీప్రహ్లాదవరద స్వామి, అమ్మవార్లకు వేకువజామునే అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠంలో వున్న శ్రీమన్నారాయణుని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వేకువజామున 3గంటల నుంచే ఆలయ క్యూలైన్లలో వేచి వుండి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు మాట్లాడుతూ ఏకాదశినాడు ఉత్తర ద్వారంలో స్వామి వారిని దర్శించుకోవడంతో సకల పాపాలు తొలగి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందన్నారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శినమిస్తారన్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తమిళనాడు, కర్ణాటక నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎగువ, దిగువ అహోబిలాల్లో కొలువుదీరిన స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి కనులారా చూసి తరించారు. అలాగే నవనారసింహులలో ఒకరైన కారంజ నరసింహస్వామి ఆలయం ఉత్తరం వైపే వుండడంతో భక్తులు కారంజ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే పట్టణ శివారులోని పడకండ్ల శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయంలో చెన్నకేశవస్వామి, సీతారామలక్ష్మణులు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. శ్రీ కోదండరామాలయం, ఆళ్లగడ్డ వెంకటేశ్వరస్వామి ఆలయం, మల్లన్న వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా మంత్రి భూమా అఖిలప్రియ, కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, తదితరులు ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో వెలసిన శ్రీస్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

మహానందిలో భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి
* ఉత్తరద్వారంలో శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చిన స్వామి
మహానంది, డిసెంబర్ 18:ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో వైకుంఠ ఏకాదశి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శివకేశవుల నిలయంగా వెలసిన మహానందిలో మంగళవారం శ్రీకోదండ రామస్వామిని శ్రీకృష్ణుని అవతారంలో అలంకరించి ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ముందుగా అభిషేక మండపం నుండి నేడి ఉభయదాతలైన పోచా జనార్థన్‌రెడ్డి, శృతి దంపతులచే, ఈవో సుబ్రమణ్యం, సంధ్యా దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రదక్షణగా స్వామి వారిని ఉత్సవంగా తీసుకువచ్చారు. ఉత్తరద్వారంలోకొలువుదీర్చి దాతలతో, అధికారులతో విశేష సేవా కాలపూజ, ఉత్తర ద్వార పూజలు, తిరుప్పావై సేవ, అలంకారం, శ్రీరామ హవనం నిర్వహించారు. అనంతరం శ్రీ కోదండ రామాలయంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఋత్విగ్వరణ నిర్వహించి లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్‌లతో పాటు ప్రత్యేక పండితుల వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పుష్పాలంకరణ చేసి చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వియోగ కార్యక్రమాలను నిర్వహించారు.
ముక్కోటి ఏకాదశి పూజల్లో
మంత్రి అఖిల, ఎమ్మెల్సీ గంగుల
చాగలమర్రి, డిసెంబర్ 18:మండలంలో ప్రసిద్ధిగాంచిన మద్దూరు గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామిని మంగళవారం మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి గంగుల బ్రిజేంద్రారెడ్డి దర్శించుకున్నారు. వారు వేర్వేరుగా హాజరు కాగా వారికి ఆలయ చైర్మన్ దస్తగిరి, పూజారులు, గ్రామ కార్యదర్శి చిన్నబ్బి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి అఖిల వెంట మండల టీడీపీ కన్వీనర్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి, నాయకులు అన్నపురెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఇండ్ల లక్ష్మిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పుల్లయ్య, పులిశేఖర్‌రెడ్డి, రాంపల్లె లక్ష్మిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నరసింహులు తదితరులు ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ గంగుల వెంట వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రుడు, ప్రచార కార్యదర్శి గణేష్‌రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, నాయకులు దేవేంద్రారెడ్డి, మనోహర్‌రెడ్డి, గోవిందయ్య, శ్రీనివాసులు, మల్లారెడ్డి, బాబి, సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు. ఇక శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి, శ్రీవాసవీమాత ఆలయాలతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు పెద్దఎత్తున నిర్వహించారు.