కర్నూల్

పశుసంవర్ధకశాఖ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, డిసెంబర్ 18:రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు అందించే పథకాలపై సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి వాటిని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పశుసవర్ధకశాఖ జేడీ సుదర్శన్‌కుమార్ సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామం పశువైద్యశాలలో డా. రామ్‌సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వీఎల్‌ఆర్‌పీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సీఆర్‌పీ పీడీ సత్యకుమారి, జేడీ సుదర్శన్‌కుమార్ మాట్లాడుతూ ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో అనేక మంది పాడి పశువులను పెంచుతూ వాటి ద్వారా జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టి వారికి అందించేందుకు ముందుకొచ్చిందన్నారు. ఆయా గ్రామాల పరిధిలో పని చేసే వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు తమకు అందజేయాలని ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే వైద్య సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని సంబంధిత వైద్యుల ద్వారా పరిష్కరిస్తామన్నారు. కాగా వీఎల్‌ఆర్‌పీలు గౌరవ వేతనం, టీఏ, డీఏలు సరిగారావడం లేదని వారి దృష్టికి తీసుకురాగా త్వరలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో గోకులం షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని వాటి నిర్మాణాలపై ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు ఇచ్చి బిల్లులు వచ్చేలా చూడాలన్నారు. కొందరు మహిళా రైతులకు కోళ్లు పంపిణీ చేశామని, పాడి పశువులను కూడా 70 శాతం సబ్సిడీతో ఎస్సీ, ఎస్టీలకు అందించామని వాటిని రైతులు పోషించుకుని జీవనం సాగించేలా చూడాలన్నారు. వారికి పశుగ్రాసం కొరత ఉంటే గడ్డి పెంచుకుంటున్న రైతులతో మాట్లాడి గడ్డి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అందించేలా చూడాలన్నారు. గొర్రెలు, మేకలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలపై రైతులకు సలహాలు, సూచనలు అందించడంలో సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మళ్లీ అధికారంలోకి వస్తాం
* మంత్రి భూమా అఖిల ప్రియ
చాగలమర్రి, డిసెంబర్ 18:ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధితోనే రాష్ట్రంలో టీడీపీ మరోమారు అధికారం చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. గ్రామదర్శినిలో భాగంగా మంగళవారం మంత్రి అఖిల స్థానిక శివాలయం వీధిలోని కూరగాయల మార్కెట్‌లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ముఖ్యంగా రోడ్లు, మురుగు కాల్వలు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అలాగే అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు, ఎన్‌టీఆర్ పక్కా గృహాలు, రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రామదర్శినిలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

హోంగార్డులకు
అన్ని సదుపాయాలు కల్పిస్తాం..
* రాయలసీమ రీజియన్ కమాండెంట్ చంద్రవౌళిశర్మ
మహానంది, డిసెంబర్ 18:పోలీసు శాఖతో పాటు వివిధ కంపెనీలు, దేవాలయాల్లో పని చేసే హోంగార్డులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాయలసీమ రీజియన్ కమాండెంట్ చంద్రవౌళిశర్మ తెలిపారు. ఆయన మంగళవారం మహానందిలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ అధికారులు వారికి జ్ఞాపిక అందజేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ రీజియన్ పరిధిలో 4 వేల మంది హోంగార్డులు పని చేస్తున్నారని, హోంగార్డుల అభ్యున్నతికై ప్రభుత్వం రెండు దఫాలుగా జీతాలు పెంచిందన్నారు. ప్రభుత్వం జీతాలు పెంచడంతో కొన్ని దేవాలయాలతో పాటు సంస్థల్లో పని చేస్తున్న వారు బడ్జెట్ లేక వెనక్కి పంపుతున్నారని, దానిపై తెలుసుకునేందుకే పర్యటన చేస్తున్నామన్నారు. అన్ని దేవాలయాల ఈఓలతో చర్చిస్తున్నామని, మహానందిలో కూడా ఇద్దరు హోంగార్డులను పెంచాలని అడగ్గా ఉన్నవారిలోనే ఇద్దరిని తొలగించి వారి స్థానంలో మహిళా హోంగార్డులను ఇవ్వాలని ఈఓ కోరినట్లు తెలిపారు. ఏదైనా ప్రమాదంలో కానీ, సాధారణ మరణం పొందిన హోంగార్డు కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా వచ్చేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ రూ. 2.5 లక్షలకు పెంచిందన్నారు. పోలీసులతో ఎక్కడికైనా వెళ్లినప్పుడు బ్లాస్టింగ్‌లలో కాని, ప్రమాదంలో కాని చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తూ ఫ్లాగ్ పని కింద ఇటీవల రూ. వెయ్యి ఇచ్చే వారని, ఇటీవల రూ. 5 వేలకు పెంచారన్నారు.

మానవ జీవన విధానాన్ని నేర్పే
అద్భుత గ్రంథం భగవద్గీత
* వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు కిష్టన్న
కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 18:్భగవద్గీత మానవ జీవన విధానాన్ని నేర్పే అద్భుత గ్రంథమని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కిష్టన్న పేర్కొన్నారు. గీతా జయంతి సందర్భంగా మంగళవారం వీహెచ్‌పీ నగర శాఖ ఆధ్వర్యంలో నగర శివారులోని విజ్ఞాన పీఠంలో సుమారు 30 పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థులచే సామూహికంగా శ్రీమత్ భగవద్గీత సహస్ర పారాయణం వైభవంగా జరిగింది. అనంతరం విజ్ఞాన పీఠం కార్యనిర్వహణ అధికారి పీపీ.గురుమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీహెచ్‌పీ జిల్లా, నగర అధ్యక్షులు కిష్టన్న, లక్కిరెడ్డి అమరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిష్టన్న మాట్లాడుతూ వీహెచ్‌పీ గత 30ఏళ్ల నుంచి ఈ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తోందని, ఇంత మంది పిల్లలు పాల్గొనడం తమకెంతో ఆనందం ఇస్తుందన్నారు. గీతలోని 6వ అధ్యాయం ఆత్మ సంయమన యోగం నుంచి శ్లోకాలు చాలా బాగా కంఠస్థం చేశారని, ఇంత చిన్న వయస్సులోనే శ్లోకాలు నేర్చుకుని పోటీలో పాల్గొనడం విశేషమన్నారు. వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు లక్కిరెడ్డి అమరసింహారెడ్డి మాట్లాడుతూ నగర శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది నూతనంగా పిల్లలందరితో శ్రీ మత్ భగవద్గీత సహస్రగళ పారాయణం నిర్వహించామన్నారు. ఇందులో పిల్లలందరూ ఏకకంఠంతో పారాయణం చేశారని తెలిపారు. సుమారు 30 పాఠశాలల విద్యార్థులు, ఎంతో ఓపికగా నేర్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జడ్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేంద్రనాథ్ మాట్లాడుతూ వీహెచ్‌పీ ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం తనకెంతో ఆనందం కల్గించిందన్నారు. భగవద్గీతలో చెప్పినట్లుగా రాబోయే తమ జీవన విధానాలను సరిదిద్దుకుని, సరైన మార్గంలో వారి జీవన ప్రయాణం సాగించాలన్నారు. అనంతరం విజేతలకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు.
టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం
* జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
నందికొట్కూరు, డిసెంబర్ 18:టీడీపీ హయాంలోనే బీసీలకు అన్నివిధాలా న్యాయం జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలపారు. పట్టణంలోని అల్లూరు రహదారిలో వున్న ఎన్‌ఎస్ కల్యాణ మండపంలో మంగళవారం నందికొట్కూరు నియోజకవర్గ జయహో బిసి సదస్సు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీలతో మొదలైందన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు బీసీ నినాదంతో ముందుకు కదలి మొదటి ఎన్నికల్లోనే చరిత్ర సృష్టించారన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలు తెలుగుదేశం పార్టీ వెన్నంటే వున్నారన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ సి ఎం చంద్రబాబునాయుడు బీసీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీసీలలో వుండే కులవృత్తుల వారి కోసం ప్రత్యేకంగా ఆదరణ పథకం అమలు చేశారన్నారు. ఆదరణ పథకం బీసీలకు ఎంతగానో తోడ్పడిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదరణ పథకం కింద కులవృత్తుల వారికి వివిధ పరికరాలు అందజేయడంలో నందికొట్కూరు ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా తెదేపాకు మద్దతు పలకాలని కోరారు.
పోస్టల్ సిబ్బంది నిరవధిక సమ్మె
ఆదోనిటౌన్, డిసెంబర్ 18:గ్రామీణ పోస్టల్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, జీడీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పోస్టల్ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఆదోని బ్రాంచ్ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, మాజీ కార్యదర్శి మునిస్వామి, కార్యదర్శి విజయ్‌లక్ష్మీ, గంగాధర్ తెలిపారు. ఆదోని ప్రధాన పోస్ట్ఫాసు కార్యాలయం వద్ద పోస్టల్ సిబ్బంది ఆల్ ఇండియా డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా జీడీఎస్ కమిటీ ప్రధాన సిఫార్సులను అమలు చేయడంలో తపాలా శాఖ ఉన్నతాధికారులతో ఈ నెల 10వ తేదీ జరిగిన చర్చలు విఫలం కావడంతో నేడు నిరవధిక సమ్మె చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 2016 జనవరి 1 నుంచి జీడీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, రిటైర్‌మెంట్ లబ్ధి చేకూర్చాలని, గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు.
టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి
* ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి
బనగానపల్లె, డిసెంబర్ 18:మండల పరిధిలోని మీరాపురం పంచాయతీలోని మాదాసుపల్లె, సాదుకొట్టం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి రూ. 80 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సొంత నిధులు రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బీసీ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. తమ హయాంలో నియోజవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలు విస్తారంగా చేపట్టామన్నారు. దాదాపు ప్రతి గ్రామంలో రూ. కోటి ఖర్చు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు కూడా అభివృద్ధి చేస్తున్న నేతలు, పార్టీలను గుర్తుంచుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీని మరోసారి బలపరచాలని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుపుతున్నారని, దద్దనాల ఎత్తిపోతల పథకాన్ని రూ. 21.25 కోట్లతో పూర్తి చేశామని తెలిపారు. ఈ పథకం మీరాపురం, యాగంటిపల్లె, పాతపాడు, మాదాసుపల్లె, జ్వాలాపురం, తదితర గ్రామాలకు చెందిన 1,541 ఎకరాలకు సాగు నీరు అందిస్తుందని తెలిపారు.

ప్రతిభావంతులైన క్రీడాకారులకు చేయూత
* ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు, డిసెంబర్ 18:ప్రతిభావంతులైన క్రీడాకారులకు చేయూతనందిస్తామని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా స్థానిక వీవర్స్ కాలనీలో నిర్వహించిన బీవీ స్మారక అంతర్రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం కల్గిన క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే వారికి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సంవత్సరం 150 జట్లు పాల్గొంటాయని తెలిపారు. క్రీడాకారులు స్నేహ పూర్వకంగా ఆడాలని తెలిపారు. ఎమ్మిగనూరు జాతర అంటే ముందుగా క్రీడలు గుర్తుకు వచ్చే విధంగా చేస్తామని తెలిపారు.