కర్నూల్

ఈతకెళ్లి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజామల, జూలై 17: ఈతకు వెళ్లి విద్యార్థి మృతిచెందిన సంఘటన ఆదివారం సంజామలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దూదేకుల కుళ్లాయి, పర్వీన దంపతుల ఏకైక కుమారుడు రాజ్‌కుళ్లాయి(16) గనిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లి మృతిచెందాడు. రాజ్‌కుళ్లాయి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తోటి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం గ్రామ సమీపంలోని నర్సిపల్లె రహదారిలో వున్న గనిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లాడు. అందరికంటే ముందుగా నీళ్లలోకి దూకిన రాజ్‌కుళ్లాయి అందులో వున్న బురదలో ఇరుక్కుపోయి మృతిచెందాడు. దీంతో తోటి విద్యార్థులు ఇంటికెళ్లి అతడి తల్లిదండ్రులకు విషయం తెలపగా వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని బోరున విలపించారు. గ్రామస్థులు రాజ్‌కుళ్లాయి మృతదేహాన్ని బయటకు తీశారు.