కర్నూల్

ఘనంగా మృత్తిక సంగ్రహణ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూలై 19: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మృత్తిక సంగ్రహణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం గురుపౌర్ణమి పురస్కరించుకుని మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీమఠం నుండి తులసి వనం వరకూ మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు మధ్య బంగారు పల్లకిలో బృందావన ప్రతిమను ఉంచి ఊరేగించారు. తులసి వనంలో బృందావనానికి, పవిత్రమైన మృత్తికకు పీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అక్కడి నుండి మృత్తికను బంగారు పల్లకిలో ఉంచి ఊరేగిస్తు శ్రీమఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనం ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. ఈక్యాక్రమంలో ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, వాసుస్వామి, కొప్రేష్ స్వామి, మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.