కర్నూల్

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 12:పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందారు. ఆత్మకూరు పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన వి.సైమన్ (75) ఏదో పనిపై ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో అటుగా వచ్చిన కొత్తపల్లె మండలం గువ్వలకుంట్లకు చెందిన ఆటో వెనుక నుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి వృద్ధుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ వృద్ధుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా ఆటో డ్రైవర్ పరారయ్యాడని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చెసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పీరయ్య తెలిపారు.