రాష్ట్రీయం

లెండి.. కానివ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాజెక్టు పనులు పూర్తి చేద్దాం * మహారాష్ట్ర సిఎంకు కెసిఆర్ లేఖ
హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ, మహారాష్టల్ర ఉమ్మడి ప్రాజెక్టు లెండిని సత్వరం పూర్తి చేసేలా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు శనివారం లేఖ రాశారు. భూ సేకరణ, నిర్వాసితులకు పునరావాసం, పెండింగ్ పనులు పూర్తి, సిడబ్లుసి అనుమతి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. గత ఫిబ్రవరి 17న మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్‌ను స్వయంగా కెసిఆర్ కలిశారు. అనంతరం రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు జూలై 23, నవంబర్ 23 తేదీల్లో రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి తన లేఖలో ప్రస్తావిస్తూ ప్రాజెక్టు శరవేగంగా పూర్తయ్యేలా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 189.73 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిందని, మహారాష్ట్ర సైతం తన వాటాగా ప్రాజెక్టు వ్యయం 273.83 కోట్ల నుంచి 554.54 కోట్ల రూపాయలకు పెంచిన అంశాన్ని గుర్తు చేశారు. సంబంధిత అధికారులకు తగు ఆదేశాలిచ్చి ప్రాజెక్టు సత్వరం పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తన లేఖలో కోరారు. (ఫైల్ ఫొటో)లెండి ప్రాజెక్టు