జాతీయ వార్తలు
ఏపీకి ఇచ్చిన హామీలు కేంద్రం విస్మరించింది:గల్లా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 July 2018
న్యూఢిల్లీ: ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. ఆయన లోకసభలో అవిశ్వాసంపై మాట్లాడుతూ..తలుపులు మూసి మరీ రాష్ట్రాన్ని విభజించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు. ఇకనైనా కేంద్రం తమకు ఇచ్చిన హామీలపై నిలబడాలని కోరారు. విభజన పాపం కాంగ్రెస్దే కాదు బీజేపీది కూడా అని విమర్శించారు. విభజనతో 90 సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయని అన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని అన్నారు. రాజ్యసభలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరు హామీలను ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.