మంచి మాట

మోక్షము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషి పునురపి జననం పునరపి మరణం లేనటువంటి మోక్షమును కోరుకుంటాడు. దానికై అనేక మార్గములు అనే్వషిస్తాడు. నిష్మర్మ, నిష్కామములు కలిగి వుండుటకు ప్రయత్నిస్తాడు. మానవుడు ఆశించే ముక్తి మూడు విధాలంటారు.సద్యోముక్తి, క్రమముక్తి , శుద్ధముక్తి.
సద్యోముక్తి అనగా కొంత అభ్యాసముతో ఎక్కువ కాలయాపన లేకుండా బ్రహ్మమునందు లీనమగుట. పరమ శాంతిని పొందుటకు కర్మను పరిత్యజించి యోగులు శరీరమును విడచే క్రమమును సద్యోముక్తి అంటారు. సద్యోముక్తి అంటే తక్షణమే తడవు లేకుండా ముక్తి పొందుట. మడమతో మూలాధార చక్రమును నొక్కియుంచి ప్రాణవాయువను బిగపట్టవలెను. ఆ ప్రాణవాయువును నాభికి దగ్గరగా వుండే మణిపూరక చక్రమునకు తీసుకుని పోవాలి. అక్కడనుంచి ప్రాణవాయువును హృదయమునకు దగ్గరగా వుండే అనాహత చక్రమునకు తరలిస్తాడు. అనాహత చక్రమునుండి కొద్దిగా పైభాగంలో వుండే విశుద్ధ చక్రమునకు అచటనుండి నుదుటికి సమీపంలో వుండే అజ్ఞాచక్రమునకు తరలిస్తాడు. ఇదంతా అభ్యాసం ద్వారా సమకూరుతుంది. ఇటువంటి స్థితిలో ఎన్నో అద్భుత శక్తులు సంప్రాప్తించవచ్చు. కాని వాటిపై ధ్యాస నిలపక నాసిక, నోరు వంటి ద్వారములను బంధించి ఇంద్రియాలతో తనకు యున్న బంధాలను తొలగించుకుంటూ బ్రహ్మద్వారమును ఛేదించుకుని పరబ్రహ్మతో లీనమవుతాడు. బుద్ధిని జీవాత్మలోను, జీవాత్మను శుద్ధాత్మలోను శుద్ధాత్మను పరమాత్మలోను లీనం చేయడం ద్వారా ఈ సద్యోముక్తి సాధ్యపడుతుంది. యోగపురుషులు మాత్రమే పొందగలిగే ముక్తి తపము జపము ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఇంద్రియములతో అనుబంధం విడిచిన వాడు పరబ్రహ్మలో లీనమైతే సద్యోముక్తి అలా ఇంద్రియములపై వ్యామోహం విడువలేనివాడు బ్రహ్మలోకం మాత్రమే చేరుతాడు. ఆ బ్రహ్మలోకమునందు శోకము దుఃఖము వంటివి యుండను గాక యుండవు. సిద్ధ యోగులయొక్క అమృతవాక్కులు సదా వినబడుతు వుంటాయి. ఈ బ్రహ్మలోకమును చేరిన వాడికి పునర్జన్మ మాత్రం లేదు. బ్రహ్మ ఎంతకాలం జీవించి వుంటాడో అంతకాలము జీవించి పుణ్యఫలమును అనుసరించి ముక్తులగుదురు. నారాయణ చరణ కమలములు ఆశించినవారు కల్పాంతమున బ్రహ్మాండమును ఛేదించి నారాయణుడువుండే గోకులము చేరి విష్ణుపదము పొందుతారు. ఇక మహాదేవుని అర్చించి కైలాస సదనం వాంఛించు వాడు లింగ శరీరంతో భూమితత్వం పొంది ఘ్రాణేంద్రియాలద్వారా విభూతి గంధము గ్రహించి లయ స్థానము అయిన అహంకార ఆవరణము చేరి మహతత్వంలోకి ప్రవేశించి శివునిలో లీనమై ఆనందమయుడు అవుతాడు. సూక్ష్మంగా క్రమముక్తి అంటే అది.
శుద్ధముక్తి. పై చెప్పబడిన సద్యోన్ముక్తి, క్రమముక్తి కేవలం సర్వసంగ పరిత్యాగులను అయిన లౌకిక వాసనలు వదిలినటువారికే సాధ్యం. మరి సామాన్యుల ముక్తికి అర్హులు కారా అంటే అర్హులే. శుద్ధముక్తి ద్వారా శుద్ధముక్తికి సాధనలు ఎలా వుంటాయి అంటే చాలా సులభంగానే వుంటాయి. కానీ క్లిష్టము, నియమ నిబద్ధమైనటువంటి జీవితం గడుపుతు మనసా వాచా కర్మణా ఏ పని అయినా త్రికరణ శుద్ధిగా చేస్తూ వుండాలి. కంటికి కనపడే దైవాలైన మాతాపితరులను జీవిత కాలం బాధ కలిగించకుండా వారికి సేవ చేయాలి. ఇక సాటి మనిషిపై ద్వేషం, అసూయ వంటి తమోరజ భావము తొలగించుకుని తనకు కేటాయించబడిన వృత్తిని ఇష్టంగా చేస్తూ యుండాలి. ఎంతటి పని అప్పగించినా భీరువు వలె వెనకకు మరలరాదు. ఏ పని చేసినా నాచే భగవంతుడు ఈ పని చేయించుచున్నాడు. నేను నిమిత్తమాత్రుడను అని భావించాలి. జనక మహారాజువలె సాంసారిక విషయములపై తామరాకుపై నీటి బిందువువలె వుంటు ధర్మమార్గము వీడగూడదు. చైతన్యునివలె, తుకారం వలె ఏకనాధుని వలె జ్ఞానదేవుని వలె సంసారంలోనే వుంటూ మోక్ష మార్గమును అనే్వషించువాడు శుద్ధముక్తికి పాత్రుడగును. ఆధునిక కాలమునకు శుద్ధముక్తికై ఆచరణ యోగ్యమైంది.

- వేదగిరి రామకృష్ణ