క్రీడాభూమి

మళ్లీ ఓడిన ముంబయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 24: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్‌లో దబాంగ్ ముంబయ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. జెపి పంజాబ్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జ ట్టు 1-3 తేడాతో ఓడింది. మ్యాచ్ ఆరంభమైన తొ మ్మిదో నిమిషంలోనే అర్మాన్ ఖురేషీ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేశాడు. దీనితో పంజాబ్‌కు బోనస్ గోల్ కూడా లభించి, 2-0 ఆధిక్యం దక్కింది. 21వ నిమి షంలో క్రిస్టోఫర్ సిరియాలో మరో గోల్ చేసి, పం జాబ్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. ఆతర్వాత పం జాబ్ రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, ముం బయ గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. 39 వ నిమిషంలో జస్‌మన్‌ప్రీత్ సింగ్ చేసిన గోల్‌తో ముంబయ ఊపిరి పీల్చుకుంది. ఖాతాను తెరిచా మని, మరో రెండు మరో రెండు క్వార్టర్స్‌లో రెండు గోల్స్ అసాధ్యం కాదని ఆ జట్టు భావించింది. కా నీ, ముంబయకి గోల్ లభించిన వెంటనే పంజాబ్ వ్యూహత్మకంగా ఆడింది. గోల్స్ చేయడంపై దృష్టి పెట్టకుండా రక్షణ వలయాన్ని పటిష్టం చేసింది. దీ నితో ముంబయకి ఎంత ప్రయత్నించినా ఒక్క గో ల్ కూడా లభించలేదు. చివరికి మ్యాచ్‌ని పంజాబ్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది.