తెలంగాణ

మరుగుదొడ్డి కట్టించలేదని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, జనవరి 25: తల్లిదండ్రులు బాత్‌రూమ్, మరుగుదొడ్డి కట్టించడం లేదని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని బాలిక మృతి చెందిన సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా గుండాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుండాల గ్రామానికి చెందిన కొడపర్తి రేఖ (16) గత ఆరు నెలలుగా బాత్‌రూమ్, మరుగుదొడ్డి కట్టించాలని అడుగుతుండేది. సోమవారం ఉదయం సైతం ఆమె అదేవిషయాన్ని వారికి గుర్తుచేసింది. తండ్రి తన జీతం పైసలు వచ్చాక కట్టిస్తానని కూతురికి సర్దిచెప్పి కూలిపనికి వెళ్లగా తల్లి కరువు పనికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేఖ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని మృతి చెందింది.
మృతురాలి తండ్రి కొడపర్తి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.