మెయన్ ఫీచర్

పటిష్ట నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ ఏడాదిన్నర క్రితం వరకు, ఒకరి తరువాత మరొకరు అధికారంలో వున్న రాజకీయ పార్టీల నాయకులంతా, మేమంటే-మేం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేస్తున్నారు. గత ఏబై ఏళ్లుగా అధికారంలో వుండి కూడా ఆ ఇరుపార్టీలు చేయలేని అభివృద్ధిని, తమ ఐదేళ్లపాలనలో చేసి చూపిస్తామని అధికార తెరాస పార్టీకి చెందిన నాయకులు చెప్తున్నారు. తమ వాదనకు మద్దతుగా గత ఏడాదిన్నర కాలంలో చేపట్టి విజయవంతంగా అమలుచేసిన పథకాలను- కార్యక్రమాలను ఓటర్లకు గణాంకాలతోసహా వివరిస్తున్నారు. దీనికి విపక్షాల నుంచి సరైన సమాధానం లేదు.
ఇంతకీ అభివృద్ధి అంటే ప్రజల అవసరాలకు అనుగుణమైన ప్ర ణాళికను రూపొందించి, ఒక నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేస్తేనే అభివృద్ధి సాధ్యవౌతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాంప్రదాయక, సహజసిద్ధమైన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. సరిగ్గా ఇదే జరుగుతోంది గత ఏడాదిన్నర కాలంగా. రాష్టవ్య్రాప్తంగా ఒకవైపు.. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జంటనగరాల- ఇతర ప్రాంతాల విషయంలో ఎన్నో ఎనె్నన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు, అమలుకు శ్రీకారం చుట్టారు. ఇలా జరగడానికి అన్నింటికన్నా ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజనీతిజ్ఞత, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, నిబద్ధత, ప్రతి అంశాన్నీ పది మందితో కలిసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే విధానం, దేన్నైనా ఒకటికి పదిసార్లు సమీక్షించిన తదుపరే నిర్ణయం చేసే సుగుణం... ఇలా మరెన్నో. వీటన్నిటి ఫలితమే అనేక పథకాల రూపకల్పన- అమలు. అభివృద్ధిని సాధించాలంటే అన్నింటికన్నా ముఖ్యం నాయకత్వం.
విశ్వవిఖ్యాత మేనేజ్‌మెంట్ రంగ నిపుణుడు జిమ్ కాలిన్స్, ‘‘గుడ్ టు గ్రేట్’’ అనే మహత్తరమైన పుస్తకాన్ని రాశాడు. అందులో ప్రధానంగా ఆయన లీడర్షిప్ లక్షణాలను, లీడర్ నాయకత్వంలో నడుస్తున్న సంస్థ బలోపేతానికి అనుసరించాల్సిన పద్ధతులను, మేనేజర్‌కు లీడర్‌కు, అందునా ఉన్నతస్థాయి లీడర్‌కు వుండే వ్యత్యాసాన్ని వివరిస్తాడు. ఆయన తన సిద్ధాంతంలో ‘‘గుడ్’’, ‘‘గ్రేట్’’ అనేవి, ఒకదానికి మరొకటి బద్ధ శత్రువులని, ‘‘గుడ్ టు గ్రేట్’’ ఎదగడానికి ఒకే ఒక దూకుడుతో జరిగే మార్పుకాదు- కానే కాదు అని, సంస్థను ‘‘సముచిత స్థాయినుంచి సమున్నత స్థాయికి’’ తీసుకెళ్లడానికి కావలసిందల్లా... ఐదో (ఉన్నత) స్థాయి నాయకత్వమని, అది అందరికీ సాధ్యమయ్యేది కాదని సోదాహరణగా వివరిస్తాడు. ఆయన ప్రకారం లీడర్ అనేవాడు మొట్టమొదట తనకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకొని వారిలో ఎవరు ఏమిటి అన్న ఆలోచన చేసి ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలో నిర్ణయిసాడు. కఠిన వాస్తవాలను ధైర్యంగా విశే్లషణ చేసుకుంటూ ఆ వాస్తవాలను వున్నదున్నట్లు పది మందికి తెలియచేస్తాడు. అర్హత-యోగ్యతల ప్రకంపనలను అధిగమించడమనే హెడ్గెహాగ్ సిద్ధాంతాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తాడు. నిరంతరం సత్ఫలితాల సాధనకు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని, సంస్కృతిని అలవరచుకుంటాడు. ఐటీలాంటి సాంకేతిక వేగ సాధనాలను సక్రమంగా ఉపయోగించుకుంటాడు. ఇవన్నీ చేసేవాడు ఐదోస్థాయి (అత్యున్నత స్థాయి)నాయకుడనిపించుకుంటాడని జిమ్‌కాలిన్స్ అంటాడు.
అరుదైన ఐదోస్థాయి (అత్యున్నత స్థాయి) నాయకత్వ లక్షణాలున్న వారు, ఆ స్థాయికి అంచెలంచెలుగా ఎదుగుతారు. అలా ఎదిగే నేపధ్యంలో వివిధ రంగాలలో వారు పొందిన అనుభవం, వ్యక్తిగత క్రమశిక్షణ, జీవితంలో ఎదురైన ఆటుపోట్లు, అనుభవం నేర్పిన గుణపాఠాలు, సహచరుల తోడ్పాటు.. ఇలా ఎన్నో వారిని ఆ స్థాయికి తీసుకెళ్తాయి. అతికొద్దిమంది మాత్రమే ఆ స్థాయికి చేరుకోగలరు. వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, మంచి అలవాట్లతో, ఫలవంతమైన తోడ్పాటును సంస్థకు అందించగలవారే మొదటిస్థాయి ‘‘స్వయం సాధకులు’’. ఇక రెండో స్థాయికి చెందినవారు, నలుగురున్న బృందంలోని ‘‘్భగస్వామ్య సభ్యులు’’. వీరు సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమతమ వ్యక్తిగత సమర్ధతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసిమెలిసి పనిచేయగలవారై వుంటారు. మూడో స్థాయికి చెందిన ‘‘మేనేజర్స్- కార్యనిర్వాహకులు’’, ముందస్తుగా నిర్ధారించిన లక్ష్యాలను సమర్ధవంతంగా సార్ధకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ- మానవేతర వనరులను ఏర్పాటుచేసుకోగల నైపుణ్యంకల వ్యక్తులై వుంటారు. నాలుగవ స్థాయి ‘‘సార్ధక నాయకులు’’, శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం- పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. వీరందరిని, ఏఏ పనికి ఉపయోగించుకోవాలో, సంస్థ లక్ష్యాలను చేరుకోవడానికి సరైన స్థానంలో ఎవరెవర్ని నియమించాలో నిర్ణయించగలిగేది ఐదో స్థాయి ‘‘కార్య నిర్వహణాధికారి’’ మాత్రమే. వీరు తమ వ్యక్తిగత నమ్రత- అణకువలను- అనుభవాన్ని- నైపుణ్యాన్ని వృత్తిపరమైన కార్యసాధనతో రంగరించి, ఒక అసంభవమైన మిశ్రమంగా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని సమున్నత స్థాయి సంస్థను నిర్మించగల సామర్థ్యంగల వ్యక్తి అయి వుంటారు. ఇలా వున్న అంచెలంచెల వ్యవస్థలోనే, ‘‘గుడ్ టు గ్రేట్’’ ఆచరణ సాధ్యమవుతుంది.
ఐదోస్థాయి కార్యనిర్వహణాధికారి నాయకత్వ తీరుతెన్నులను అర్థంచేసుకోగలగడం ఆ స్థాయివారికే తప్ప ఇతరులకు అంత త్వరగా అర్థంకాదు. ఎంత కష్టమైనా- ఎన్ని అవాంతరాలెదురైనా సడలని సంక ల్పం ప్రదర్శించి దీర్ఘకాలిక ఫలితాలను సాధించేందుకు కృషిచేస్తాడు. నమ్రత- అణకువలను కార్యసాధనలో అడుగడుగునా ప్రదర్శించుకుంటూ, వినయ-విధేయతలతో కార్యోన్ముఖుడవుతాడే గాని, గొప్పలు చెప్పడం- ముఖస్తుతి కోరుకోవడం చేయ డు. పట్టుదలతో, హంగు-ఆర్భాటం లేకుం డా నిర్ధారించిన ప్రమాణాల ఆధారం గా ముందుకు సాగుతాడు. సంస్థలో పనిచేసే వారిలో మంచి ఫలితాలను సాధించాలనే ప్రగాఢ వాంఛను కలిగించి, తనలాంటి ఇతరులను తయారుచేసి, భవిష్యత్‌లో రాబోయే తరం వారిలో మరిన్ని విజయాలను సాధించేందుకు తగిన వారసులను సృష్టించగలడు.
సముచిత స్థితినుంచి సమున్నత స్థితికి సంస్థను తీసుకెళ్లాలంటే, అందుకు తగిన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం కార్యనిర్వాహకులు మొట్టమొదట చేసే పని. ముఖ్యం గా తన సహచర ‘‘నాయకత్వ బృందం’’ విషయంలో మరిం త శ్రద్ధగా ఆ పని చేయాలి. తాను నిర్దేశించిన ప్రమాణాలను- సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వ్యక్తులను ‘‘సంస్థ వాహనం’’నుంచి తక్షణమే దింపగల నేర్పరితనముంటుంది వారికి.
ప్రభుత్వంలో, రాజకీయాలలో ఐదోస్థా యి ‘‘కార్యనిర్వహణాధికారి’’ నాయకత్వమంటే, ‘రాజనీతిజ్ఞుడు’అని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ‘‘పరిపాలన’’గురించి విన్నాం... ఆ తరువాత కాలంలో ‘‘సుపరిపాలన’’అనేది పాపులర్ అయింది. అంతకంటే మెరుగైన పాలన కోరుకుంటున్నారు ప్రజలు. ‘‘రాజనీతిజ్ఞతతో కూడిన సుపరిపాలన’’ కావాలంటున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల వర్తమాన అవసరాలను మాత్ర మే తీరిస్తే సరిపోదు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి. గత ఏఢాదిన్నర కాలంలో ఈ రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్‌లో జరగబోయేది అదే. రాష్టవ్య్రాప్తంగా, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూపొందించి, అమలుచేస్తున్న పథకాలు సార్వజనీనమైన పథకాలే! ఈ పథకాలన్నీ ముఖ్యమంత్రి ‘‘రాజనీతిజ్ఞత’’కు నిదర్శనాలే! ఉదాహరణలు కోకొల్లలు. అందులో కొన్ని...
జంట నగరాలలో నివసిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం మంచినీటి సరఫరా చేసేందుకు, రెండు డెడికేటెడ్ రిజర్వాయర్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసిస్తున్న వారికి నిరంతరం నాణ్యత గల విద్యుత్ సరఫరా జరుగుతోంది. భవి ష్యత్‌లో ఇంతకంటె మెరుగ్గా సరఫరా చేయడానికి కూడా ప్రణా ళికలు సిద్ధమవు తున్నాయ. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని ఐడీహెచ్ కాలనీలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, నిర్మాణం పూర్తి చేసి స్వయంగా ముఖ్య మంత్రి చేతుల మీదుగా గృహప్రవేశం జరిగిం ది. ఇలాంటివి వేల-లక్షల సంఖ్యలో నిర్మిం చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇలాంటి గృహాలను పేదవారికి ఇవ్వడం ద్వారా వాళ్ల ఆత్మగౌరవం పెరుగు తోంది. హైదరాబాద్ అసలు సిసలైన అభివృద్ధి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రమే మొదలైంది. దాని బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించడానికి, హైదరాబా ద్‌కున్న కాస్మోపాలిటన్ సంస్కృతిని భవి ష్యత్‌లో కొనసాగేలా చూడటానికి అనేక చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఆసరా పిం ఛన్లు, కార్మికుల బీమా సౌకర్యం, జర్నలి స్టులకు ఆరోగ్య కార్డులు, హాస్టల్ విద్యా ర్థులకు సన్నబియ్యం, సాంస్కృతిక కార్యక్ర మాలకు కళాభారతి నిర్మాణం..ఇలా ఎన్నో ఎనె్నన్నో...
శాంతి భద్రతల విషయానికి వస్తే తెరాస అధికారంలోకి వచ్చాక జంట నగరాల పరిధిలోని మహిళల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పోలీసులకు ప్రత్యేక వాహనాలతో పాటు మరెన్నో సౌకర్యాలు కల్పించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చంచల్ గూడ జైలును, హైదరాబాద్ రేస్‌కోర్స్ క్లబ్‌ను అక్కడి నుంచి తరలించి ఆ ప్రదేశంలో మైనారిటీలకు రెసిడెన్షి యల్ పాఠశాలలు నిర్మించడానికి ప్రణాళిక తయారైంది. జంట నగరాల ప్రజలకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసించే వారికోసం సీమ్‌లెస్ ట్రాఫిక్ వ్యవస్థ, వ్యూహాత్మక రహదారుల వ్యవస్థ రూపు దిద్దుకుంటోంది. జంట నగరాల ప్రజలకు అవసరమైన మోడల్ మార్కెట్లు, మల్టీ పర్పస్ హాళ్ల నిర్మాణం, సామూహిక మరుగుదొడ్లు, శ్మశాన వాటికల లాంటి కనీస వౌలిక వసతులు కలిగిం చేందుకు, సివిక్ పరమైన సౌకర్యాల కల్పనకు అనేక చర్యలు తీసుకుంటున్నది ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బాలిక వివా హానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఇతరులకు కూడ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. హైదరామాద్ నగరానికి చెరు వుల, తోటల నగరంగా ఒకప్పుడు పేరుం డేది. క్రమంగా అవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యా యని చరిత్ర చెబుతోంది. వీటి పునరుద్ధరణకు, అలానే గ్రీన్ కవర్ పెంచడానికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటోంది. జంటనగరాల, గ్రేటర్ హైద రాబాద్ పరిధిలో అనేక ప్రభుత్వ-ప్రైవేట్ ఆసు పత్రులు ఉన్నాయ. ఇన్ పేషెంట్ కిందికి వచ్చే రోగులకు ఆసుపత్రిలో వుండేందుకు సౌకర్యా లున్నప్పటికీ, వారి వెంట వచ్చే అటెం డెంట్లకు సరైన సౌకర్యాలు లేవు. వీరి కొరకు నైట్ షెల్టర్ల ఏర్పాటు జరుగుతోంది. ఎంఎం టీఎస్ విస్తరణ, మెట్రో పనుల వేగవంతం, కొత్త బస్ టెర్మినల్స్, కొత్త రైలు టెర్మినల్స్‌కు ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నది. నగరం సమీ పంలో ఫార్మా సిటీ, ఆరోగ్య-వైద్య సిటీ, లాం టివి ఏర్పాటు చేయడానికి కార్యాచరణ ప్రణా ళిక సిద్ధమైంది. అందుకే ఇప్పుడున్నది కేవలం ‘‘పరిపాలనో’’ లేక ‘‘సుపరిపాలనో’’ కాదు. ‘‘పరిపాలనలో రాజనీతిజ్ఞత’’...అదే అభివృద్ధికి పునాది.

- వనం జ్వాలా నరసింహారావు సెల్ : 08008137012