మెయన్ ఫీచర్

కేరళ వరదలో బురద రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాదేదీ కవితకనర్హం అన్నాడు మన తెలుగు కవి. రాజకీయవేత్తలు ఈ రహస్యం గ్రహించారు. ఏ సంఘటన జరిగినా దానిని ఎన్నికల రాజకీయాలతో ముడిపెట్టి చూడటం మొదలుపెట్టారు. కేరళ రాష్ట్రంలో నూరు సంవత్సరాలుగా కనీవినీ ఎరుగని వరదలు వచ్చాయి. ఇది పాలకపక్షం సీపీఎం చేసిన దుర్మార్గపు నిర్ణయాల ఫలితమేననే ఆరోపణలు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి విరాళాలు కేరళలోకి ప్రవేశిస్తున్నాయి. అరబ్ ఎమిరిటస్ (యు-ఎ-ఇ) నుండి 700 కోట్లు కేరళకు వచ్చాయి. దీనిని కేంద్రం తిరస్కరించింది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది. అందువలన ముస్లిం దేశాలనుండి వచ్చిన సహాయాన్ని కేంద్రం తిరస్కరించిందనే ప్రచారం మొదలుపెట్టారు. ఇక్కడ పాఠకులకు తెలియవలసిన అంశం ఏమంటే విదేశీ సహాయం తీసుకోవద్దు అనే నిర్ణయం లోగడ యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తీసుకున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బిజెపి ముస్లిం వ్యతిరేకి అనే ముద్రవేసి, రాజకీయ లబ్ధిపొందాలని కాంగ్రెసు, సిపియంలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే ఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటస్ సహాయం తిరస్కరణ సంఘటన. అంతేకాదు వివిధ ప్రాంతాలనుండి అందుతున్న సహాయాలను సిపియం నాయకులు వారి ఇళ్లకు ఎందుకు తీసుకుపోతున్నారు? వీరి నిజాయితీ ఎంత? ఏ కార్పొరేటు సంస్థలను వారు రాత్రింబవళ్లు తిడుతూ వచ్చారో ఆ సంస్థలనుండే ఇప్పుడు కేరళకు సింహభాగం సహాయ నిధులు అందాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య శ్రీమతి సుధామూర్తి స్వయంగా మాతృహృదయంతో బట్టలు, ఆహారం చిన్న చిన్న పాకెట్లుగా కట్టి పంపిన దృశ్యాలు మనం మీడియాలో చూచాము. మరి సునిల్‌చోప్రాలు ఎవార్డ్ వాపసీ గాంగ్ ఇలాంటి సహాయాలు చేశారా??
కేరళపై వరుణదేవుడు పగపట్టాడని అంతా భావిస్తున్నారు- ఇందులో నిజం ఎంత? నైరుతీ ఋతుపవనాలు ముందుగా కేరళ తీరాన్ని తాకుతాయి. సహజంగానే అక్కడ వర్షం ఎక్కువగా ఉంటుంది. 1924లో వచ్చిన జలప్రళయం లాంటిది ఇప్పుడు 2018లో వచ్చిందని వార్తలలో చూచాము. ఇది నిజంకాదు. 1924లో కురిసిన వర్షపాతం కన్నా ఇప్పటి వర్షపాతం తక్కువ. మరి ఈ జలప్రళయానికి కారణాలేమిటి?? దీనిపై శాస్ర్తియ విశే్లషణ అవసరం.
కేరళలో దాదాపు 40 నదీ నదాలున్నాయి. వీటన్నింటిపైనా డాములు కట్టి నీరు నిల్వచేశారు. వీటిలో మన నాగార్జునసాగర్ వంటి అతిపెద్ద డాములు ఇడిక్కి ఇత్యాదులు ఉన్నాయి. ఈ సందర్భంగా కేరళలో కాంగ్రెసు-కమ్యూనిస్టు ప్రభుత్వాలు ప్రకృతితో పరిహాసమాడాయి. 2010లో మాధవగాడ్గిల్ తన నివేదికలో కేరళ భవిష్యత్తులో ‘మునిగిపోతుందని’ సూచించాడు. అందుకు ఆయన చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి.
1) డాముల పేరుతో క్వారీలు మైనింగులు జరుగుతున్నాయి. ఇవి ఎకాలజీ సంతులనాన్ని ధ్వంసం చేస్తున్నాయి.
2) అక్రమ ఇసుక మాఫియాలవల్ల నదీనదాల గమనవేగం మారిపోతున్నది.
3) పర్యాటక రంగంద్వారా ధన సంపాదన మీద దృష్టిపెట్టి కొండ చరియలల్లో రిసార్ట్స్ నిర్మిస్తున్నారు. ఇది విధ్వంసకారకం.
4) వర్షజలం సముద్రంలోకి పోకుండా అవరోధాలు ఏర్పడుతున్నాయి. అంటే వరదలువస్తే ఈ నీరు జనావాసాలలోకి వెళ్తాయి.
మాధవ గాడ్గిల్ నివేదికను రాజకీయవేత్తలు తుంగలోతొక్కారు. ఇవ్వాళ 2018లో సరిగ్గా అదే జరిగింది. లోగడ ఉత్తరాఖండ్‌లో అడవులు నరికి జలవిద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేయటంతో భూమి తన పటుత్వాన్ని కోల్పోయి నీటిని నిరోధించలేకపోయింది. ఫలితంగా భారీ సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కేరళలోనూ అదే జరిగింది. వైనాడ్ అడవుల సంతులనం దెబ్బతిన్నది. పడమటి కనుమలలోని మట్టి జలప్రవాహాలను నిరోధించలేకపోయింది. ఇక్కడ మిరియాలు, ఏలకులు, లవంగాలు పండుతాయి. ఈ వ్యవసాయంమీద దృష్టిపెట్టి కొండలను బలహీనపరిచారు. అంటే ఈ ప్రకృతి విపత్తుల్లో మానవ తప్పిదం (మాన్‌మేడ్) చాలా ఉన్నది అనేది సుసృష్టం. కేరళలో రాజకీయ పార్టీలు గత అరవై సంవత్సరాలుగా హత్యలకు దిగాయ. అంటే కేరళలోని కన్నూరు, త్రిశూర్ ప్రాంతాలు రక్తంతో తడిసిపోయాయి. ఈ వరదలు ఆ ప్రాంతాలను ముంచెత్తాయి. ఇది యాదృచ్ఛికమా? దైవ నిర్ణయమా?
ప్రస్తుతం 20వేల కోట్ల ప్రాథమిక నష్టం అంచనావేశారు. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు లక్షలాది పశువులు, పంటల నష్టలు అంచనాకు అందటంలేదు. వరదలు తగ్గుముఖం పట్టాక వేల సంఖ్యలో శవాలు బయటపడుతాయి. సహాయ పునరావాస కార్యక్రమాలు గృహనిర్మాణాలు తలకుమించిన పని. అందుకే స్థానిక ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇప్పటికే చేతులు ఎత్తేశాడు. కోస్ట్‌గార్డ్, భారత రక్షణశాఖ, విపత్తుల నిరోధక శాఖ, స్థానిక పోలీసుదళాలు, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, నాయల్ సొసైటీ, అమృతానందమయి సేవాసంస్థ వంటివి రంగంలోకి దిగాయి. లోగడ ఈ సంస్థల కార్యకర్తలను స్థానిక కమ్యూనిస్టులు హత్యచేశారు. అమృతానందమయిని ఆమె ఇంటినుండి తరిమివేశారు. ఇవ్వాళ ఈ పుణ్యమూర్తులే కేరళకు దిక్కుఅయినారు.
కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా కేరళలో ఎమర్జెన్సీ విధించాలి. మొత్తం పరిపాలనా బాధ్యత పునర్నిర్మాణ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి.
పినరయ్ విజయన్ పరిపాలనకు అనర్హుడు అని లోగడ ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఐనా పట్టించుకున్న నాధుడు లేడు. ఇళ్లల్లోకి పాములు, కొండ చిలువలు, మొసళ్లు వస్తుంటే ‘ఓ దేవుడా రక్షించు’ అని ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. తన జీవితంలో ఒక్కరోజుకూడా కేంద్రంతో సహకరించలేదు. సరికదా వందలాది ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కార్యకర్తలను కేరళలో స్వయంగా హత్యచేయించాడు. కేరళ రాష్ట్రం ఏ ఒక్కరి హక్కు భుక్తంకాదు. అది భారతదేశంలో ఒక అంతర్భాగం. కాని కమ్యూనిస్టు పార్టీవారు ఒంటెత్తుపోకడలతో ఇనే్నళ్లూ వ్యవహరించారు. కేరళలో క్రైస్తవుల దుర్మార్గాలు మితిమీరిపోయాయి. ఎందరో నన్స్ (క్రైస్తవ సన్యాసినులు) బలాత్కారాలకు గురిఅయినారు. ఈ పనిచేసింది మరెవరో కారు. క్రైస్తవ బిషప్పులే. ఇవ్వాళ కేరళ కన్నీరుకారుస్తుంటే వీరు ఏం చేస్తున్నట్లు?
* * *
నదులను దేవతలుగా భావించే దేశం మనది. మరి మూసీనది ఒక మురికి కాలువగామారింది. చెన్నైలో నదీపరీవాహక ప్రాంతాలన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి వరదలు వచ్చాయి. ముంబయిలో అసలు డ్రైనేజీ వ్యవస్థయే సరిగ్గాలేక ఆమధ్య నగరం మునిగిపోయింది. కాలుష్యపు కోరలలో గంగానది చిక్కుకున్నది. ఇప్పుడీ దుర్మార్గం కేరళకు చుట్టుకున్నది. కొండ చరియలు విరిగిపడి వందలాది మంది ఎందుకు మరణించారో స్థానిక ప్రభుత్వం సమాధానం చెప్పాలి?? కర్ణాటకలోని కొడగు (కూర్గు) ప్రాంతం ఎందుకు నిన్న వరదలలో మునిగిపోయింది? ఎవరైనా శాస్ర్తియంగా విశే్లషించారా?? కేరళవలె ముంబయి, హైదరాబాదు భవిష్యత్తులో మారుతాయి అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
‘‘్భ వనరులపై ఒత్తిడి ఈ జలప్రళయాలకు కారణం’’ అని ప్రముఖ శాస్తవ్రేత్త కస్తూరిరంగన్ అభిప్రాయపడ్డారు. జనాభా పెరుగుదల, వ్యవసాయ భూములు తగ్గిపోవటం అక్రమ మైనింగ్ వంటివి జల ప్రళయాలకు కారణం అని వీరు భావించారు. లోగడ బీహార్ (కోసి) అస్సాం (బ్రహ్మపుత్ర), ఉత్తరాఖండ్ (గాగ), కావేరి (కర్ణాటక), చెన్నై, ఇప్పుడు కేరళలలో ఈ జలప్రళయాలు వచ్చాయి. ముంబయి నగరం పదేండ్ల క్రితం మునిగిపోయింది. ఐనా ఎట్టి జాగ్రత్తలు తీసుకోలేదు. కొనే్నళ్ల తరువాత గోవా- ముంబయి-కేరళలు సముద్రంలో కలిసిపోతాయని శాస్తజ్ఞ్రులు హెచ్చరిస్తున్నారు.
పినరయ్ విజయన్ చేసిన పాపానికి మొత్తం కేరళ రాష్ట్రం జల సమాధి అయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయం చాలదు. ఇంకా ఇవ్వండి-అంటూ కేరళ ప్రభుత్వమూ, రాహుల్‌గాంధీ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సైనిక బృందాలను జాన్‌దయాళ్ సునిల్ చోప్రా వంటివారు నిందిస్తున్నారు- ఎందుకు? గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలను తుంగలో తొక్కారు. ఎంతసేపూ పర్యాటకం-లాభాలు అనే దృష్టితప్ప పర్యావరణ నిబంధనలను పాటించలేదు. ఇది మానవాళికి ప్రమాదకరంగా మారింది. దీనికి నిస్సందేహంగా రాజకీయ పార్టీలదే బాధ్యత. మొన్న ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయినాయి. అమృతానందమయి, ఆర్‌ఎస్‌ఎస్ నాయర్ సొసైటీ, రామకృష్ణమఠ్ వంటి సామాజిక సంస్థలమీద దాతలకు నమ్మకం ఉందే కాని సియం రిలీఫ్‌ఫండ్‌కు దానాలు ఇవ్వటానికి దాతలు ముందుకురావటం లేదు. ఎందుకు? స్థానిక ప్రభుత్వంమీద విశ్వాసం లేకపోవటానికి కారణం ఏమిటి??
మరో వార్త: అయ్యప్పస్వామి బ్రహ్మచారి. ఆయన ఆలయంలోకి బహిష్టు స్ర్తిలు ప్రవేశించారు. దాంతో అయ్యప్పకు వచ్చింది. ఈ చర్చ ఓ టి.వి.చానల్‌లో జరిగింది.
భౌతిక కారణాలు: ఒకేసారి రెండు అల్పపీడనాలు ఆగ్నేయ ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. 2018 జూలైలో సాధారణ వర్షపాతం నమోదు అయింది. కాని ఆగస్టులో ఒక్కసారిగా 164 శాతం వర్షపాతం నమోదుకావటానికి సోమాలీ జెట్‌స్ట్రీమ్ ప్రభావం ఉందని పర్యావరణవేత్త మహేష్ విశే్లషించారు. ప్రైవేటుసంస్థ స్ట్కెమెట్ విశే్లషణ ప్రకారం మడగాస్కర్‌నుండి వచ్చిన ప్రభంజనాలు పడమటి కనుమలను తాకాయని జెపిశర్మ వెల్లడించారు.
కన్పడని కారణాలు: పర్యావరణవేత్తలు హేతువాదంతో భౌతిక వాతావరణ కార్యకారణ సంబంధాలను విశే్లషించి వివరిస్తారు. ఆధ్యాత్మికవేత్తలు పుణ్యం పాపం అంటూ మరికొన్ని కారణాలు చెపుతారు. పాపం పండితే భూకంపాలు, జలప్రళయాలు వస్తాయని వారి విశ్వాసం. కేరళలో దశాబ్దాలుగా రక్తచరిత్ర నడుస్తున్నది. కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇస్లామిక్ ఉగ్రవాదులు కేరళలోని ప్రతి అంగుళాన్ని మానవ రక్తంతో తడిపారు. ఇక చర్చిలలో వ్యభిచారం పెరిగింది. పవిత్ర సన్యాసినులపై ఫాదరీలు దశాబ్దాలుగా రేప్ చేయసాగారు. దానికి జీసస్ కంట తడిపెట్టారు.
ఇవి పరోక్ష కారణాలు: పినరాయ్ విజయన్ చేసిన పాపాలకు మొత్తం భారతదేశం మూల్యం చెల్లించవలసి వచ్చింది. 2600కోట్లు తక్షణ సహాయం ప్రకటించండి అని కేరళ ముఖ్యమంత్రి కేంద్రాన్ని బెదిరిస్తున్నాడు. ఒకవేళ నిధులు ఇచ్చినా అవి సద్వినియోగం అవుతాయనే నమ్మకం లేదు. ఎందుకంటే ఇదొక అవినీతి ప్రభుత్వం. శవాలమీద పేలాలు ఏరుకొని తిన్నట్లు ఈ వరద బాధిత నిధులను వీరు దారిమళ్లిస్తారు.
కేరళలో అనంత పద్మనాభస్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. ప్రాచీన చక్రవర్తులందరూ తాము పద్మనాభ దాసులు అని చెప్పుకునేవారు. అక్కడి అనంత నిధులు ఏమైనాయి? వాటిపై నాస్తిక ప్రభుత్వాల అజమాయిషీ ఏమిటి? కేరళలోని దేవాలయాల్లో హిందూ సాంస్కృతిక సమావేశాలు జరుగకూడదు అని పినరయ్ విజయన్ నిషేధం విధించాడు. ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పివారు సాయంత్రం దేవాలయాల్లో భజనలు నిర్వహిస్తూ ఉంటారు. వాటిపై విజయన్ నిషేధం విధించాడు. గోకులాష్టమినాడు బాలగోకులం అని చిన్నపిల్లలకు గురువాయూరులో శ్రీకృష్ణుని వేషం వేసి ఉత్సవం చేస్తారు. దానిని సిపియం నిషేధించింది. ఎందుకు? అని ప్రశ్నిస్తే ఇవ్వాళ కృష్ణుడు వేషం వేసుకున్న బాలుడు రేపు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా మారుతాడు అని సమాధానం చెప్పాడు. సంప్రదాయ ఓనం పండుగపై నిషేధం విధించాడు. బక్రీదునాడు గోవులను చంపుతుంటే అడ్డుకోలేదు. ఈ విధంగా కేరళ గోరక్తంతో తడిసింది. ఇప్పుడు వరుణదేవుడు కేరళ భూమిని ప్రక్షాళన చేశాడు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్