మెయిన్ ఫీచర్

పండుగవేళ అందంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగ రోజుల్లో అందరూ అందంగా కనిపించాలనుకుంటారు. హడావుడిలో పార్లర్‌కి వెళ్లే సమయం ఉండదు. అందుకని ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్‌లను వేసుకోవడం వల్ల ముఖం అందంగా, తాజాగా, కాంతులీనుతూ ఉంటుంది. అవేంటో చూద్దాం..

తాజాపండ్లతో..

ఒక బౌల్‌లో అరటిపండు చిన్న ముక్క, ఆపిల్ ముక్క, పీచ్ ముక్క, స్టా బెరీ ఒకటి తీసుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను వేసి స్పూన్‌తో పండ్లన్నింటినీ మెత్తగా చిదమాలి. ఇలా కాసేపు చిదుముతూ ఉండటం వల్ల, తేనె వేయడం వల్ల ఇది మెత్తని పేస్ట్‌లా తయారవుతుంది. ఆపిల్ ముక్క వేసేటప్పుడు తొక్కతీసుకోవాలి. అప్పుడు అది మెత్తగా అవుతుంది. అవసరమైతే బ్లెండ్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ మాస్క్ వల్ల వెంటనే ఫలితం ఉంటుంది. ముఖం తాజాగా మారుతుంది. వర్షాకాలంలో ఈ ప్యాక్ వల్ల నిర్జీవంగా మారిన చర్మం తేమను సంతరించుకుంటుంది. కాంతులీనుతుంది.

ఓట్‌మీల్, రోజ్‌వాటర్‌తో..

ఒక బౌల్‌లో మూడు స్పూన్ల ఓట్‌మీల్‌ను తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూను రోజ్‌వాటర్ కలపాలి. ఇందులోనే కొద్దిగా తేనె, ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసి బాగా కలపాలి. ఈ మిశ మాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మఋతకణాలు తొలగిపోయి, ముఖం కాంతులీనుతుంది. ఈ ఫేస్‌ప్యాక్‌ను వారానికోసారి వేసుకోవడం వల్ల ముఖం అందంగా, నునుపు తేలుతుంది.

ముల్తానీమట్టితో..

ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ముల్తానీమట్టిని తీసుకోవాలి. అందులో సరిపడా రోజ్‌వాటర్‌ను కలిపి మెత్తని మిశ మంలా తయారుచేయాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లనినీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల వాడిపోయిన చర్మం తేమను పీల్చుకుని తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

శనగపిండితో..

ఒక బౌల్‌లో రెండు, మూడు స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. దీనిల్పు కొద్దిగా పసుపును వేయాలి. దీనికి కొద్దిగా నిమ్మరసాన్ని, రోజ్‌వాటర్‌ను కూడా చేర్చి మెత్తని మిశ మంలా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి పదిహేను, ఇరవై నిముషాల తర్వాత కడిగేయాలి. ఇది అన్ని చర్మతత్త్వాలకు సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల వాతావరణ మార్పుల వల్ల ముడుచుకుపోయిన ముఖం తాజాదనాన్ని సంతరించుకుని నిగనిగలాడుతుంది.

కోడిగుడ్డుతో..

కోడిగుడ్డులో కొద్దిగా బియ్యప్పిండిగానీ, శనగపిండికానీ వేసి బాగా కలపాలి. ఇందులోనే కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ మాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖం బిగుతుగా తయారయ కాంతులీనుతుంది.