మెయిన్ ఫీచర్

బాలల భవితే ముఖ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం (యూనివర్సల్ చిల్డ్రన్స్ డే) నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలు అనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన నవంబర్ 20వ తేదీన స్వీకరించడం జరిగినది. బాలల హక్కులు - బాలల మనుగడ, గుర్తింపు, ఆహారం, పోషకాహారం మరియు ఆరోగ్యం, అభివృద్ధి, విద్య మరియు వినోదం, కుటుంబ మరియు సుపరిచితమైన పర్యావరణం, బాలలపట్ల నిర్లక్ష్యం, బాలల రక్షణ, బాలల అక్రమ రవాణా, లైంగిక దాడులు మొదలైనవి పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని బాలల హక్కుల ప్రకటన చేయడం జరిగింది.
ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కులపై చట్టబద్ధమైన ఒక అంతర్జాతీయ ఒప్పందం ‘కనె్వన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్’ తీసుకురావడం జరిగింది. ఇందులో బాలలకు పౌర, సాంస్కృతిక, ఆర్థిక సామాజిక, రాజకీయ హక్కుల వంటి మానవ హక్కులను అన్నింటిని చేర్చారు. వీటి అమలును కమిటీ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ పర్యవేక్షిస్తుంది.
జీవన హక్కు
పిల్లలకు వుండే ఈ జీవించే హక్కు కిందకు కనీస అవసరాలైన పోషణ, తలదాచుకోవడానికి గూడు, కనీస జీవన స్థాయి, వైద్య సేవల అందుబాటు.
అభివృద్ధి హక్కు
పిల్లలు విద్య, ఆటలు, విరామం, సాంస్కృతిక కార్యక్రమాలు, సమాచారం తెలుసుకునే హక్కులు, స్వేచ్ఛగా ఆలోచించే హక్కు, అభీష్టానికి అనుగుణంగా నడుచుకునే హక్కు, మత స్వేచ్ఛ.
రక్షణ హక్కు
పిల్లలను అన్ని రకాల దుర్వినియోగాలు, నిర్లక్ష్యం, దోపిడీల నుంచి రక్షణ కల్పిస్తుంది. శరణార్థులుగా వచ్చిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, నేర విచారణ వ్యవస్థలో పిల్లలకు రక్షణ, ఉద్యోగాల్లో పిల్లలకు భద్రత, దోపిడీ, వేధింపులకు గురైన బాలల రక్షణ, పునరావాస కల్పన.
పాల్గొనే హక్కు
పిల్లలు తమ సొంత జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై భావాలను, ఉద్దేశాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను, సంఘాలలో చేరడానికి, శాంతియుతంగా సమావేశం కావడం.
ప్రభుత్వాలు పిల్లల గోడు పట్టించుకోనపుడు యునైటెడ్ నేషన్స్ కన్‌వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద ఛైల్డ్ (యుఎన్‌సిఆర్‌సి) పిల్లలకు సహాయంగా నిలుస్తుంది. ఇటీవల చెన్నైలో పదకొండేళ్ల దివ్యాంగురాలిపై కామాంధులచేతిలో చిత్రవధలకు గురైన సంఘటన. మనుషులమధ్యన ఉంటున్న 22 మంది రాక్షసులు, క్రూరమృగాలు పశువులలాగా అభం శుభం తెలియని ఒక దివ్యాంగురాలిపై అత్యాచారం. ఉత్తరాఖండ్‌లో ఎనిమిదేళ్ల చిన్నాపై అశ్లీల వీడియోలకు బానిసలుగా మారిన మైనర్లు అత్యాచారం సభ్య సమాజం తలదించుకొనే పరిస్థితి దాపురించింది. తమ కామవాంఛ కోసం చిన్నారులపై వికృత స్థాయిలో విజృంభిస్తూ వికృతరూపంగా మారుతున్న మానవ మృగాలను ఏం చేయాలి?
బాలల హక్కులపై కనె్వన్షన్ అంతర్జాతీయ మానవ హక్కుల శాసనంలో ఒక మైలురాయిని దాటింది. బాలల హక్కులపై కనె్వన్షన్ ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడానికి, పిల్లల హక్కుల పరిరక్షణలో, పిల్లల సమగ్ర అభివృద్ధికి విస్తృతమైన చర్యలను చేపడుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల పరిరక్షణకోసం ఏదో ఒక్క రోజులోనే ప్రకటించబడిన అంశమేమీ కాదు. చాలా సంవత్సరాలుగా పిల్లల వైపుగా ఆలోచనలు చేస్తూ వారిలో సానుకూల, అనుకూల, నిర్మాణాత్మక వైఖరులను రూపొందించడాని, పిల్లల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చేసిన ఉద్యమాల ఫలితంగా మాత్రమే ఇది రూపొందించడం జరిగింది.
భారతదేశంలో బాలలను కాపాడటం, బాలల ఎదుగుదలకు ప్రోత్సహించడం, పిల్లల హక్కులు రక్షించడానికి 2007లో మార్చి నెలలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ నేషనల్‌కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థను ఏర్పాటు జరిగింది. చైల్డ్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వ విభాగాలు, డ్వాక్రా గ్రూపులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించడం జరుగుతుంది. బాలల హక్కులను రక్షించడానికి టోల్‌ఫ్రీ నంబరు 1098ను ఏర్పాటుచేయడం జరిగింది.
లక్ష్యాలు
పిల్లలను ఒక వ్యక్తిగా గుర్తించాలి, వారిని అర్థం చేసుకోవడానికి, వారి అవసరాలను అంచనా వేయడం, మానవ హక్కులన్నీ పిల్లలకు కూడా వర్తింపజేయడం, పిల్లలు సమాజంలో ప్రత్యేక గౌరవం పొందడానికి, వారి భద్రతను కాపాడడానికి, బాలల హక్కుల చట్టాలపట్ల చైతన్యం కలిగించడం, పిల్లలలో సృజనాత్మకతను వెలికితీయడం, పిల్లలలో జీవితం పట్ల భరోసా కల్పించడం, సామాజికంగా ఎదుగుదలకు తోడ్పడటం, బాలల హక్కుల రక్షణ అమలు తీరును సమీక్షించుకోవడం, పిల్లలకు 18 సంవత్సరాలు నిండేంతవరకు పిల్లలపట్ల తల్లిదండ్రుల బాధ్యతపై చైతన్యం కలిగించడం, లైంగిక దాడులు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యతను గుర్తించునట్లుగా చైతన్యం కలిగించడం, బాలలపై హింసాకాండను తగ్గించడం లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని బాలల హక్కుల దినోత్స వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
హక్కుల పరిరక్షణ
ప్రపంచ వ్యాప్తంగా పిల్లల హక్కుల పరిరక్షణలో కొంతమేరకు పురోగతి సాధించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా భారతదేశం, పిల్లల హక్కులను గుర్తించడంలో కొంతమేరకు వెనుకబడి ఉందని చెప్పవచ్చు. పోక్సో చట్టం, నిర్భయ చట్టం, ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం- ఇలా చట్టాలు చేసినప్పటికీ వాటి అమలులో పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోతోంది. అన్ని స్థాయిలలోనూ పిల్లల సంక్షేమం కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేయవలసిన అవసరం ఉంది.
పిల్లలపై శిక్షలు నేరం
2002 ఫిబ్రవరి 18 నాడు నాటి విద్యా శాఖ పిల్లలను శారీరకంగా శిక్షించకుండా ఉండేలా ఒక జీవోను జారీ చేశారు. అది 1966లో జారీచేసిన జీవోఎంఎస్‌నెం 1188లోని పిల్లలకు శారీరకంగా శిక్ష విధించే అంశాలకు బదులుగా ఈ జీవో జారీ చేశారు. 2002లో జారీచేసిన జీవో ప్రకారం అన్ని విద్యా సంస్థల్లోని పిల్లలను శారీరకంగా శిక్షించడాన్ని నిషేధించింది.
మేధావులకు నిలయం
ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన మేధావులను మన భారతదేశం తయారుచేస్తోంది. అందులో సందేహంలేదు. ఆ ప్రతిభ ఎవరిది? ప్రస్తుత బడుల పనితీరా, విద్యావ్యవస్థదా లేక అన్ని రకాల కుటుంబ సమాజ ఒత్తిడులకు తట్టుకొని, ఎంతో శ్రమించి చదివిన పిల్లలదా? విపరీతమైన పోటీ, పిల్లలలో పెరిగిపోతున్న ఆశల ఒత్తిడివల్ల, పాఠశాలల, ఉపాధ్యాయుల మనుగడకు మంచి ఫలితాలను సంపాదించడమేది ముఖ్యమైపోయింది. అందువల్ల విద్యార్థులలో రకరకాల ఒత్తిడులు పెరిగిపోతున్నాయి. వాటిని తట్టుకోలేని ఫలితంగా విద్యార్థులలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మనం ఇప్పటికైనా ఈ నిజాన్ని గుర్తించి కళ్లు తెరవకపోతే ప్రతిభావంతమైన ఒక తరానే్న కోల్పోవాల్సి వస్తుంది.
దేశ భవిష్యత్తు
ఒక దేశ భవిష్యత్తు బలంగా తయారుకావడానికి బాలల యొక్క నైపుణ్యాల వృద్ధిపైన ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. బాలల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఒత్తిడి రహిత సమాజ నిర్మాణానికి కృషిచేయాల్సిన అవశ్యకతపై చైతన్యం కలిగించాలి. జీవన నైపుణ్యాలపై అవగాహన ద్వారా బాల్యదశ నుండే జీవిత విలువలను గుర్తింపచేయవచ్చు. మానసిక వికాసం, విద్యా వికాసం, విలువలను పెంపొందించే దిశలో కృషిచేయాలి. బాలల హక్కుల పరిరక్షణకు, బాలల మెరుగైన భవిష్యత్తుకోసం ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321