మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔదార్యమాతని జీవన సౌరభమైనచో, సరళతయే యందలి చక్కదనము, పసిబాలుని నమ్మికను బోలు నమ్మిక గలిగి సత్యమును బ్రహ్మచర్యమును బరిపాలించుటయే సాక్షాత్కారమునకు నిశ్చితమార్గమని- వినిర్మల హృదయముననే భగవానుడు విస్పష్టముగా గోచరించునని- శిష్యుల కాతడు ప్రకటించును. ఏ రూపమున నొనర్చినను మనఃపూర్వకమగు ప్రార్థనము జపమును ధ్యానమును భగవంతుని వశమొనర్చు కొన గలవని యాతడు వక్కాణించును.
శ్రీరామకృష్ణుని బోధన నవరస భరితము. నవ్వుచు, పరిహసించుచునే అతి గభీర విషయములను- ఆధ్యాత్మిక విషయములను- ఆతడతి విచిత్రముగా బోధించును. అతని సంభాషణము లొకప్పుడు కడుపు చెక్కలగునట్లు నవ్వించును, మఱియొకప్పుడు శ్వాసలుకట్టువడ నిశే్చష్టులనొనర్చును; ఇంతలో అఖండావేశము గలిగించును; అంతలో అపూర్వ చిత్తశాంతిని జేకూర్చును. భక్తి పరవశుడై యాతడొక కీర్తనమును బాడి జగజ్జనని నామము నుచ్చరించుచు నృత్యము చేయును. పిమ్మట ప్రాయికముగా భగవానుని సగుణనిర్గుణ స్వరూప సమన్వయమువంటి వేదాంత రహస్యములను గూర్చి సహజ సరళరీతి నత్యద్భుతముగా బోధించును. అమాయకుడగు యోగీంద్రున కాత డెట్లు బేరమాడ వలయునో తెల్పెను; నిరంజనుని దుడుకుతనమును నిరసించి నిరోధించెను; స్ర్తిల యెడ ద్వేషభావము జూపుచుండిన హరికి వారియెడ పూజ్యభావము నలవరుచుకొనుమని బోధించెను; ఏకపుత్త్రుని గోల్పోయి కుందుచుండిన మణిమల్లికు నోదారెచ్చను; ఆలుబిడ్డల నలక్ష్యముచేయుచుండిన యొకని చీవాట్లు పెట్టెను. భక్తిగానిండు, వేదాంతముగానిండు, లోకవర్తనము గానిండు- దేనిని గూర్చి బోధించినను, అతని బోధనలు హాస్య చమత్కారములతో, మనోహర దృష్టాంతములతో నీతి కథారత్నములతో, వంగీయ గ్రామ్యసంభాషణ శైలిలో మృదుమధుర స్వరమున ప్రాణప్రదీప్తములై యలరారుచుండెడివి. ఈ సంభాషణముల నడుమ నాతడు భక్తి పరవశుడై మహోత్తమ సమాధిస్థితులను బొందుతుంచుట జూచి జనులబ్బురపడుచుండెడివారు.
ఇట్లు తరచు సమాధినిమగ్నుడయ్యు, (సదా) భగవదేకార్పితచిత్తుడయ్యు, నిత్యకృత్యములతో అల్ప విషయములందు సైతమాతడు జూపు శ్రద్ధయత్యద్భుతము. శౌచమునందేమి, గృహోపకరణములను యథాక్రమమున నుంచుట యందేమి యాత డతిజాగరూకుడు. చినిగిన గుడ్డలతోడను తెగిన చెప్పులతోడను జనులు సంచరించుటనిన, అతనికి రోత. తానెచ్చటికి వెడలినను, తన కుపయుక్తమగు వస్తువులను గైకొని మరీ వెడలను. మరియు తమ్ము పిలిచినవారికిబ్బంది కలుగురీతినగాని, అట్టి సమయమునగాని యెన్నడును వెడలవలదని శిష్యులకుద్బోధించును. జోడుకాని, గొడుగు గాని, అంగవస్తమ్రు కాని జీవితమునాతడెన్నడును నెచ్చటను మఱచివచ్చి యెఱుగడు. అతని కన్ను సూక్ష్మదర్శిని, మరియు దూరదర్శిని. అతడొక భవనమున బ్రవేశిచినచో, అందలి వస్తువులను-ఇతరులు గమనింపని వానిని సైతము- ఒక్కుమ్మడి కటావీక్షణముననే పరిశీలించి వాని నిజరూపస్థితులను ఎంతకాలమునకు బిమ్మటనైనను అచ్చముగా కంటికి గట్టినట్లు వర్ణింపగలుగువాడు.
సద్గురువరేణ్యుడడు శ్రీరామకృష్ణు డీరీతిని మహోత్త మాదర్శమును దన జీవితమున లోకమునకు బ్రకటించుచు, తన బోధామృతమును గ్రోలు తమకమున దన్ను సందర్శించు ముముక్షుకోటికి నిద్రాహారములను మరచి బోధింపసాగెను. విశ్రాంతి నెరుగని ఇట్టి ప్రబోధపరంపరచే నాతని సుకుమార శరీరము సడలిపోసాగెను-అతని కంఠములో (1885వ సంవత్సరమున) వ్రణము బయలుదేరెను. భక్తులాతని కలకత్తా నగరమునకు దీసికొని వెడలి సుప్రసిద్ధుడగు మహేంద్రలాల్ సర్కారుచే చికిత్స చేయింపసాగిరి. కాని వ్యాధి నానాటికి ప్రబలమగుచుండెను. అగ్గి కప్పురమును హరించునట్లు ఆ ఘోరవ్యాధి యాతని జీవితమును హరింపసాగెను. కాని యాతని బ్రహ్మానందమునకుగాని, నిరంతర బ్రహ్మానుభూతికిగాని అణుమాత్రమును లోపము కలుగకుండెను.
శ్రీరామకృష్ణుని యుపదేశ సుధ లోకమున కవిచ్ఛిన్నముగా లభించిన దీసమయముననే.
ఇంకా ఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి