మెయన్ ఫీచర్

మనుధర్మ పరిరక్షణకు మోదీ కంకణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకులకు ‘్భగవద్గీత’ అంటే చాలా ఇష్టం. అందులో ఉన్న ‘స్వధర్మే నిధనం శ్రేయః’లాంటి శ్లోకమంటే వారికి బహుప్రీతి! ధర్మానికి గ్లాని (్భంగం) కలిగినప్పుడు, ధర్మాన్ని రక్షించడానికి మోదీ, కేసీఆర్ లాంటివాళ్ళు అవతార పురుషులుగా జన్మిస్తారు! అధర్మాన్ని ఖండిస్తారు, పాపులను శిక్షిస్తారు. ధర్మసంస్థాపన చేస్తారు. ఇంతకీ భగవద్గీతలో చెప్పిన ఆ ‘్ధర్మ సంస్థాపన’ కార్యక్రమం ఏంటి? స్వధర్మాన్ని పాటించడం అంటే వేదాల్లో, భగవద్గీతలో, మనుధర్మశాస్త్రంలో చెప్పిన వర్ణవ్యవస్థలోని కులధర్మాన్ని నూటికి నూరుపాళ్ళు పాటించడం. అగ్రవర్ణాలు ఆధిపత్యం చలాయించడం. శూద్రులు సేవకులుగా అగ్రవర్ణాలకు నిరంతరం సేవ చేయడం, కులవృత్తుల్లో మగ్గిపోవడం. ఆ తర్వాతి కాలంలో శూద్రుల్లోంచి విభజింపబడిన అతి శూద్రులు అంటరానివారిగా ఊరుబయట ఉంటూ సవర్ణులకు సేవ చేయడం. వీటికి భంగం కలిగిస్తే ‘స్వధర్మా’న్ని అతిక్రమించినట్టు!
ప్రజాస్వామ్యం పేరుమీద, రాజ్యాంగ స్ఫూర్తి పేరుమీద శూద్రులైన బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించాడు. దాంతో కొంతమందైనా శూద్రులు చదువుకొని జీవితాలను గెలుచుకుంటున్నారు. ఇది గీతా శ్లోకం ప్రకారం స్వధర్మాన్ని అతిక్రమించినట్టే. అందుకే మోదీ, కేసీఆర్ లాంటి వారు ‘నయా క్షత్రియులు’గా అవతారాలెత్తి ధర్మసంస్థాపనం చేస్తున్నారు. ఇది దళిత బహుజనులకు తమ తమ సేవకావృత్తుల్లో ఉండి ధర్మ సంస్థాపనానికి తోడ్పడమని చెప్పడానికే.
ఈ ‘్ధర్మ సంస్థాపన’లో భాగమే బీసీలకు గొర్రెలు, బర్రెలు, మేకలు, పందులు, చేపలు, చాకలి బండలు, మంగలి షాపులు, బండగొట్టే సుత్తెలు, చెప్పులు కుట్టే సామగ్రిని ఇచ్చి కుల వృత్తుల్లో మగ్గిపొమ్మని శాసిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా, స్వాతంత్య్రానంతరం కూడా కులవృత్తుల్లో మగ్గిపోయిన వారెవరూ పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఈ వర్గాల్లో ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారెంతమందో ఉన్నారు. బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో కొందరు రిజర్వేషన్ల వల్ల బాగా చదువుకొని జీతాలను గెలుచుకోగలిగారు. ఇది కూడా భగవద్గీతను నూటికి నూరుపాళ్లు అనుసరించే నాయకులకు నచ్చడం లేదు. అగ్రవర్ణ ప్రజలకూ నచ్చలేదు. అందుకే రిజర్వేషన్లు తీసివేయాలని లొల్లి.
బహుజనులకు చదువులు అందుబాటులో లేకుండా చేయడానికి ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. ఖరీదైన కార్పొరేట్ విద్యను ముందుకుతెచ్చారు. అన్ని రంగాల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. దీంతో ఈ దేశ బహుజనులు చదువుకోలేక, భారీ ఖర్చులు భరించలేక నానాయాతనలు పడుతున్నారు. చదువుకున్నా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరకడం కష్టం. ఇప్పటికే అన్నిరకాలుగా ఇబ్బందిపడుతున్న బహుజనులకు ఉన్నత విద్య లేకుండా చేయడానికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తెస్తున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు మోదీ అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకవసరమైతే రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ మోదీ, కీసీఆర్ మార్క్ ధర్మసంస్థాపనలో భాగమే. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకునే రాజకీయాలే.
మోదీ లాంటి నాయకులకు భారత రాజ్యాంగంపై గౌరవం లేదు. రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లపై సదభిప్రాయం లేదు. క్రమక్రమంగా వీటిని తొలగించాలన్నదే వీరి పథకం. బహుజనుల్లో నుంచి వచ్చిన కొందరు నాయకులు ఇంకా అగ్రవర్ణ నాయకుల మోచేతికింది నీళ్ళుతాగే వారుగానే ఉన్నారు. మోదీ దేశవ్యాప్తంగా బహుజనులను అణగదొక్కడానికి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లిచ్చినా, కేసీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించినా ఎవరూ నోరు మెదుపరు. ఒకానొక్క ‘ద్రవిడ’ వీరుడు స్టాలిన్ తప్ప ఈ రాజ్యాంగం విరుద్ధచర్య గురించి మిగతా నేతలు మాట్లాడలేదు.
అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. అసలు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేన్లిస్తే అగ్రవర్ణాలకు మాత్రమే ఎందుకివ్వాలి? అగ్రవర్ణ పేదలకంటే దుర్భర దారిద్య్రంలో భిక్షకులుగా, సంచార జీవులుగా ఒక్కపూట కూడా కడుపునింపుకోలేని స్థితిలో బహుజన కులాలవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అగ్రవర్ణ పేదలకు కనీసంగా సామాజికపరమైన గౌరవమైనా ఉంది. చిన్నదో చితకదో ఇల్లయినా ఉంది. కనీస చదువులైనా ఉన్నాయి. కాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేదలకు అవేవీ లేవు. కోట్లాదిగా ఉన్న బహుజన నిరుపేదలను వదిలిపెట్టి అతి స్వల్పంగా ఉన్న అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం సరైందేనేమో ఆలోచించండి.
పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించదలుచుకుంటే, అందుకోసం రాజ్యాంగాన్నైనా సవరణ చేయదలుచుకుంటే కుల మతాలకతీతంగా అందరికీ వర్తింపజేయడం సబబు. మిగతా 50 శాతంలో 30 శాతం ఆర్థిక ప్రాతిపదికన అందరికీ రిజర్వేషన్లు కల్పిస్తే నిజమైన పేదలు లాభపడుతారు. అలాకాకుండా పేదరికం ప్రాతిపదికన అంటూ అగ్రవర్ణాలకు మాత్రమే రిజర్వేషన్లను ఇవ్వడం బహుజనులను మోసగించే చర్యే. పేదరికాన్ని నిర్మూలించడమనేది మానవీయ ధర్మం. నిరుపేదలకు, సామాజిక దురన్యాయ బాధితులను, సామాజిక గౌరవం కూడా లేనివారిని అలాగే ఉంచి పేదలైనా ఏదో కొంత మంచి స్థితిలో ఉన్న అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం ధర్మసమ్మతం కాదు. ఈ విభాగంలో అందర్నీ చేర్చడం అన్యాయం.
ఆర్థిక కోణంలో రిజర్వేషన్లను, అదీ అగ్రవర్ణాలకు మాత్రమేనని ఉత్తర్వులు జారీచేయడం రాజ్యాంగాన్ని కించపరచడమే. రాజ్యాంగ స్ఫూర్తిని భంగపరచడమే. కొద్దిమంది దళితులు, బీసీలు ఆర్థికంగానూ, రాజకీయంగానూ బలంగానే ఉన్నా, రాష్టప్రతి స్థాయిలో ఉన్నా దళిత పెద్దలను గుళ్ళలోకి రానీయని సామాజిక వ్యవస్థ ఉన్న దేశం మనది. ముఖ్యమంత్రులయినా, ఎంత ఉన్నతస్థానాల్లో ఉన్నవారయినా బ్రాహ్మణ పెద్దలకు సాగిలపడే దేశం మనది. ఓ దళిత, బి.సి. మంత్రయినా సరే అగ్రవర్ణ, బ్రాహ్మణ ఐ.ఎ.ఎస్. అధికారిని శాసించలేడు. ఇలాంటి వ్యవస్థలో సామాజికంగానూ అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థానంలో ఉన్న అగ్రవర్ణాలకు పేదరికం పేరుమీద రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయం, అక్రమం, ధర్మ, న్యాయ, చట్ట విరుద్ధం. ముందు ఈ దేశానికి అవమానకరమైన సామాజిక అంతరాలను, అంటరానితనం లాంటి దుర్మార్గ దురాచారాలను తొలగించడానికి చట్టాలు చేయాలి. రాజ్యాంగ సవరణలు చేయడం అవసరమే. అప్పుడు సామాజికంగా అందరూ సమానవౌతారు. ఆ తర్వాత ఆర్థికపరమైన రిజర్వేషన్లు అందరికీ కల్పించండి. మోదీ తరహాలో చేస్తే మధ్యయుగాల్లోని మనుధర్మమే పునరావృత్తమవుతుంది. ఇప్పటికే రాజకీయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, ప్రభుత్వ ప్రైవైట్ ఉద్యోగాల్లోనూ, విద్యారంగంలోనూ, ఆర్థిక రంగంలోనూ, పరిపాలకులుగానూ, ఆస్తిపరులుగానూ అగ్రవర్ణాలే 80-90 శాతం పైగా ఉన్నారు. వీరి జనాభా 15 శాతం మాత్రమే. 85 శాతంగా ఉన్న బహుజనులు అన్ని రంగాల్లోనూ 10-15 శాతంగా కూడా లేరు. 85 శాతం జనాన్ని అలాగే ఉంచి అగ్రవర్ణాల్లో ఏదో కొంతమంది పేదలున్నారని బహుజనులకు దక్కే కొద్ది భాగాన్ని కూడా కబళించబడటం అధర్మం, అన్యాయం. మనుధర్మ పాలకులు దీన్ని ఆమోదించినా దేశానికి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు దీన్ని తిరస్కరించి ఈ దేశంలో వంద కోట్ల బహుజనులకు న్యాయం చేస్తుందని ఆశిద్దాం.

-డా. కాలువ మల్లయ్య 91829 18567