మెయన్ ఫీచర్

అసమాన ప్రజ్ఞకు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో కలసి అల్పాహారానంతరం విలేఖరులతో సమావేశం.. ఎయిర్‌పోర్టుకు వెళుతూ సిఎంతో భేటీ.. మధ్యాహ్నం విజయవాడలో పార్టీ ప్రతినిధులతో ముచ్చట్లు.. సాయంత్రం బెంగళూరులో అధికార కార్యక్రమం.. రాత్రి దిల్లీలో కేంద్రమంత్రుల బృందంతో సమావేశం.. ఇన్ని పనులు ఒక్కరే ఎవరైనా చేయగలరా? ఈరకమైన అవధానం, అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, సహస్ర శతావధానాలు ఎవరైనా చేయగలరా? మాడుగుల నాగఫణిశర్మ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ కార్యాలన్నీ చక్కదిద్దగల ఏకైక సాహసికుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అ ది- ఒక్క ముప్పవరపు వెంకయ్యనాయుడు మాత్రమే. అందుకే ఆయనను ఉప రాష్టప్రతి పదవి వరించింది. ‘నన్ను ‘ఉషాపతి’గానే ఉండనివ్వండి. మరే పతులూ అవసరం లేదు. నేను ఉప రాష్టప్రతి రేసులో లేను. ఇంకా పుట్టని పిల్లగాడికి పేరు పెట్టమన్నట్లుంది’- అంటూ ఎంత తప్పించుకున్నా.. నెల్లూరు నాయుడుగారి నెత్తిన సంఘ్- మోదీ ద్వయం కలసి ఉప రాష్టప్రతి బాధ్యత బలవంతంగానే కట్టబెట్టేసింది.
నిస్సందేహంగా నాయుడుగారు ప్రతిభాశాలి. గోడలపై కుంచెతో రాసే స్థాయి నుంచి ‘నేతల అదృష్టాన్ని’ లిఖించే స్థాయికి ఎదగడం ఆషామాషీ కాదు. అందులోనూ తెలుగువాడు. ఉత్తరాది పెత్తనమే ఉండే జాతీయ పార్టీలో అత్యున్నతమైన అన్ని పదవులూ అనుభవించి, ఈ స్థా యికి రావాలంటే ఎంత కష్టమో అనుభవించిన వారికే ఎరుక. ‘కమలం’ కష్టాల్లో పడిన ప్రతిసారీ ఆయనే దిక్కయిన సందర్భాలు బోలెడు. ప్రత్యర్థి పార్టీలతో మంతనాలకైనా, మాట వినని ప్రాంతీయ పార్టీలను దారికి తీసుకురావాలన్నా, నచ్చినవారిని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలన్నా, నచ్చని వారిని శంకరిగిరి మాన్యాలు పట్టించాలన్నా, తనను నమ్ముకున్న వారిని అందలమెక్కించాలన్నా వెంకయ్య తర్వాతే ఎవరైనా! ఆ సమర్థత తెలిసే ‘సంఘ్’ నాయకులు ఆయనను ఉప రాష్టప్రతి పీఠంపై కూర్చోబెట్టారు.
ఇది తెలియని తెలుగు మీడియా కులవేల్పులు- నాయుడుగారు ఉప రాష్టప్రతిగా వెళితే తెలుగు రాష్ట్రాలకు దిక్కుండదని, దక్షిణాది రాష్ట్రాలు అనాథలవుతాయని , ఏపీకి నిధులు ఆగిపోతాయని కఠిన శిలలు కూడా కరిగిపోయేంత విషాదాన్ని జోడించి చేసిన ప్రచారం చూస్తే.. అసలు ఆయన కంటే తెలుగుమీడియా కులవేల్పులే బోలెడంత బాధలో ఉన్నట్లు కనిపించింది. వెంకయ్య ఉప రాష్టప్రతి అవుతున్నారనగానే దక్షిణాది రాష్ట్రాలకు- ఉత్తరాది వల్ల అన్యాయం జరుగుతోందంటూ చేస్తున్న కొత్త వాదనలో కసి, కోపం ఎవరి కోసమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కు లాలు, ప్రాంతీయ పోరాటాలపై టన్నుల కొద్దీ ఆవేదన కురిపించే మీడియా ఆసాములే ప్రాంతీయ విద్వేషాలకు బీజం వేయడం, ఎవరి మెప్పుకోసమో రోజూ పత్రికలు చదివే పిల్లవాడికీ తెలుసు. కాకపోతే.. తెలుగు మీడియాలో కథనాలు ఎలా ఉంటాయి? ఏ విధంగా పుట్టుకు వస్తాయి? అవి ఎవరి ప్రాయోజితాలు? ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నాయి? ఎవరి మెరమెచ్చుల కో సం కథనాలు వండి వారుస్తున్నాయి? అన్న తెరవెనుక రాజకీయాలు తెలుగు పాఠకుడికి అవగతమే కాబట్టి, ఆ కథనాల వెనుక ఎవరున్నారన్నది సులభంగానే అర్థం చేసుకోగలిగారు.
వెంకయ్యను ‘కాషాయదళం’ మ ర్యాదగా పక్కకుపెట్టిందని, వద్దు వ ద్దంటున్నా బలవంతంగా ఉప రాష్టప్రతిని చేసి క్రియాశీల రాజకీయాల నుంచి బలవంతంగా సెలవు ఇప్పించిందని, ఇకపై ఆయన జోక్యం దక్షిణాది రాష్ట్రాలపై ఉండదు కాబట్టి, అమిత్‌షా-మోదీ ద్వయం దక్షిణాదిన చేపట్టబోయే కొత్త ఆపరేషన్లకు ఆటంకాలుండవంటూ.. వెంకయ్య అంటే పడని దుర్మార్గ సోషల్ మీడియా, ఆయన వ్యతిరేక శక్తులు ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తేనేమి? వెంకయ్య ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనందున ఆయన హితైషి ‘చిత్తూరు నా యుడు’కి కష్టాలు దాపురించాయని సంతోషపడితేనేమి? దిల్లీ దర్బారులో పెద్ద దిక్కుగా ఉన్న తమ జాతి మహనీయుడి సేవలు ఇకపై ప్రత్యక్షంగా లభించవని ‘తెలుగునేతలు’ చాటుగా వెళ్లి గుడ్డలు కుక్కుకుని కన్నీరుమున్నీరైతేనేమి? నెల్లూరు నాయుడికి దక్కింది నిస్సందేహంగా అరుదైన, అనిర్వచనీయమైన, అనితరసాధ్యమైన గౌ రవం. వెంకయ్య ఆరాధకుడైన ఏపి బిజెపి ప్రముఖుడు ఒకాయన- ‘ఆయనతో ఉప రాష్టప్రతి పదవి తీసుకోమని చెప్పేందుకు అమిత్‌షా, మోదీ భయపడిపోయార’ని పార్టీనేతలతో అన్నారట! నిజమే మరి. ఇన్నాళ్లూ తన మేధస్సునంతా ఏపిలో పార్టీ పురోగతి కోసం, దేశంలో బిజెపి బలం కోసం ఆరోగ్యం సైతం లెక్కపెట్టకుండా పనిచేస్తున్న తనకు, క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగడం ఇష్టం లే దని, తల్లిలాంటి పార్టీలోనే ఉం టానని భీష్మించిన వెంకయ్యను బుజ్జగించి, ఆయనను ఏవిధంగా ఒప్పించాలని మోదీ- అమిత్‌భాయ్ భయపడే ఉంటారు.
‘కమలం’ కష్టాల్లో ఉన్నప్పుడు రథమెక్కి పార్టీని జగన్నాథ చక్రాల మాదిరిగా ఉరికించిన వెంకయ్య గురువు అద్వానీకి ఇలాంటి గౌరవం దక్కిం దా? మురళీమనోహర్‌జోషికి ఇ లాంటి అదృష్టం దక్కిందా? పా పం.. వి.రామారావు ఎనే్నళ్లు పో రాడితే గానీ జిల్లా అంత ఉండే ఒక చిన్న రాష్ట్రానికి గ వర్నరు కాలేకపోయారు. దత్తాత్రేయ ఎనే్నళ్లో జనంలో ఉంటే తప్ప కేంద్రమంత్రి కాలేకపోయారు. విద్యాసాగరరావు కష్టాల తర్వాతే కదా ఇపుడు మహారాష్టల్రో గవర్నరుగిరీ అనుభవిస్తోంది? మరి వీరందరి కంటే మన నెల్లూరు నాయుడు గొప్పవారా? కాదా?! ఇ వేమీ ఆలోచించకుండా వెంకయ్య రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే దక్షిణాది రా ష్ట్రాలన్నీ అనాథలై పోతాయన్నట్లు రాసే రాతలు, ఒక వి ధంగా నాయుడుకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తున్నాయని ఆయన అభిమానుల వా(వే)దన. ఎందుకంటే మో దీ-అమిత్‌భాయ్ ఆవులించకుండానే పేగులు లెక్కపెట్టగలిగే సమర్ధులు. అనుమానం ముందు పుట్టి తర్వాత వారు పుట్టారన్న పేరూ ఉంది. మరి ఆ స్థాయిలో వెంకయ్యను ఆకాశానికెత్తి, ఆయన వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయని, ఆయన లేకపోతే పార్టీ నడవదన్నట్లు, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం డజన్ల మంది కేంద్రమంత్రులను ప్రధాని స్థాయిలో తన వద్దకే పిలిపించుకుని పనిచేయిస్తున్నారనే కథనాలు రాస్తే.. అవన్నీ దిల్లీలోనే ఉంటూ దేశమంతా కళ్లు చేసుకుని మరీ చూసే మోదీ-అమిత్ భయ్యాకు తెలియకుండా పోతుందా? మరి ఇవన్నీ మెరమెచ్చుల కోసం స్వామిభక్తి ప్రదర్శించి ఆ తాదాత్మ్యంలో, వెంకయ్యను స మస్యల్లో పెట్టడమే కదా? అన్నది ఆయన నిజమైన అభిమానుల వేదన.
అయినా ‘ఉషాపతి’కి ఉప రాష్టప్రతి పదవితో ప్రతిష్ఠ ఇంకా పెరిగిందే తప్ప తరగలేదు. ఎంతోమంది సీనియర్లుండగా తననే ఆ అదృష్టం వరించిందంటే అది ఆయన సమర్థతే కదా? ఇప్పటికే మన తెలుగుజాతి ఆణిముత్యాలు నలుగురైదురు ఢిల్లీలో కీలక స్థానాల్లో వెలిగిపోతున్నారు. నెల్లూరు నాయుడు ఇపుడు ఆ జాబితాలో చేరతారంతే! మన జాతి ప్రముఖులకు అంతటి గౌరవం దక్కితే అది మనకూ దక్కినట్లు తెలుగుమీడియా కులవేల్పులు ఎందుకు అర్థం చేసుకోరన్నది ‘కమలదళాల’ వాదన. వెంకయ్య ప్రత్యర్థులు సైతం ఆయనకు ఉపరాష్టప్రతి పదవి దక్కినందుకు నిండుమనసుతో అభినందిస్తున్నారు. ఎప్పుడో దక్కాల్సిన గౌరవం ఆలస్యంగా దక్కినా అందుకు ఆయన అర్హుడేనని కితాబునిస్తున్నారు. తన అద్భుత, అనితర, అనన్యసామాన్య ప్రసంగాలతో రాజ్యసభకు శోభ తెచ్చిన ముప్పవరపువారి రాకతో, రాజ్యసభకు వనె్న మరింత పెరుగుతుందని భావించాలి.
***
తెలుగుతెరకు ఏమైంది..?
తెలుగు సినిమా స్టార్లంటే తెలంగాణ సర్కారుకు మరీ లెక్కలేకుండా పోయింది. డ్రగ్స్ తీసుకున్నారన్న నెపం మీద విచారణకు పిలిపించి, గంటలకు గంటలు ప్రశ్నల వర్షం కురిపించడానికి పోలీసులది గుండెనా? చెరువా? సినిమా స్టార్లంటే చట్టానికి చుట్టమని ఇప్పటివరకూ జరిగిన అనేకానేక ఘటనలు నిరూపించిన నిజాలు గుర్తులేవా? బాలయ్య కాల్పుల కథలో హీరో ఎవరో, విలనెవరో కనిపెట్టలేక అటకెక్కిన విజయగాథను పోలీసులు అప్పుడే మర్చిపోయారా? ఏదో సినీ చిరంజీవులు కుర్రతనంలో మోజుపడి కొంచెం డ్రగ్స్ తీసుకున్నారే అనుకోండి. అంతమాత్రాన వారికి నోటీసులిచ్చి వేధిస్తే అల్లువారు, దగ్గుబాటి వారు జాయింటుగా చెప్పినట్లు సినీ పరిశ్రమ పరువేమైపోతుంది?
సరే.. అకున్ సబర్వాల్ సాహసాన్ని, రోజుకు 12 గంటలపాటు విశ్రాంతి కూడా లేకుండా, తెలుగు జనాలపై డ్రగ్స్ ఎపిసోడ్‌ను పోలీసులతోపాటు ఆ గదిలో తామూ విచారిస్తున్నట్లు గ్రాఫిక్స్‌తో కళ్లకుకట్టి చూపిస్తున్న చానళ్లను అభినందిద్దాం. మరి తెలుగు పరిశ్రమను ఏలుతున్న ‘ఆ నలుగురి’లో ఇద్దరు పెద్దతలల ముగ్గురు ముద్దుల పుత్రుల డ్రగ్స్ సేవనంపై సోషల్ మీడియా కోడై కూస్తున్నా, ఆ చిరంజీవుల పేర్లు నోటీసు జాబితాలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించవెందుకు చెప్మా? తెలుగు సీరియల్ మాదిరిగా ఎపిసోడ్ వారీ నోటీసుల బదులుగా, తెరచాటున దాగున్న వారందరిపేర్లు సింగిల్ షెడ్యూల్‌లో ఎందుకు బయటపెట్టలేకపోతున్నారన్న భేతాళప్రశ్నకు జవాబిచ్చే విక్రమార్కుడెవరు?
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144