మెయిన్ ఫీచర్

భారతీయ బార్బీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పుడు ఆడుకోమని పెద్దలు ఎందుకు బొమ్మలు ఇస్తారో ఈ అమ్మాయని చూస్తే అర్థమవుతుంది. ఆ పసివయసులో ఈ బొమ్మలే వారిలో సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతాయ. బొమ్మల్లో బార్బీ బొమ్మకున్న విలువ అంతా ఇంతా కాదు. ఈ బొమ్మ ఉండని ఇల్లు ఉండదు. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను బార్బీ బొమ్మతో పోల్చారు. ఇలాంటి ఈ బొమ్మను ఆధారంగా చేసుకున్న శైలజ కియా ఇండియన్ డాల్‌కు శ్రీకారం చుట్టారు. బొమ్మలతో భారత వారసత్వాన్ని పరిచయం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆలోచన.. ప్రేరణలే ఆమెని పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కారణమయ్యాయి. తీర్థాల హిమశైలజ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టింది. ముంబై యూనివర్సిటీ పరిధిలోని ఎల్‌టిసిఇ కాలేజీనుంచి ఎలక్ట్రానిక్స్ బిఇ పూర్తిచేశారు. 1998 నుండి ఆమె వివిధ కార్పొరేట్ కంపెనీల్లో విఎల్‌ఎస్‌ఐ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత మరో తొమ్మిది సంవత్సరాలు అమెరికా, యూకె, సిలికాన్ వ్యాలీలో డిజైన్ ఇంజనీర్‌గా పనిచేసి మంచిపేరు సంపాదించుకుంది.
డిజైనింగ్‌లో ఉన్న అనుభవంతో 2003 సంవత్సరంలో శైలజ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో బార్బీ డ్రెస్ పోటీల్లో పాల్గొన్నారు. అంతే అప్పటివరకు ఫ్యాషన్ డ్రెస్సుల్లో వున్న బార్బీ ఒక్కసారిగా ఇండియన్ ట్రెడిషన్ డ్రెస్సులో మారిపోయింది. ఈ మార్పుతో శైలజ లైఫ్‌స్టయిల్ మారిపోయింది. వివిధ కంపెనీల్లో పనిచేసిన అనుభవం.. ఆమెను ఓ పారిశ్రామికవేత్తగా మార్చేసింది. అప్పటివరకు విదేశాలకు చెందిన సారా, బార్బీ, పుల్లిష్, పుల్లా లాంటి బొమ్మలకు ధీటుగా భారతీయతకు దర్పణం పట్టే కియా డాల్స్ ఆవిర్భవించడానికి కారణమైంది. 2012లో షెల్ స్టూడియోతో పాటు కియా బొమ్మల ప్రాజెక్టు పని ప్రారంభించారు. పిల్లలకు, మహిళల దుస్తులు కోసం ప్యాషన్ బోటిక్ ప్రారంభించారు.
కియా ప్రాజెక్టును పరిశీలించిన ఐఎస్‌బి బృందం హైదరాబాద్‌లో డబ్ల్యుఇడిపి కోర్సులో చేరేందుకు శైలజకు అవకాశం ఇచ్చారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండి.. మహిళా పారిశ్రామికవేత్తలకు గోల్డ్‌మ్యాన్ సాక్స్ స్పాన్సర్ చేసింది. డిసెంబర్ 2014లో కియా బొమ్మల ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించారు. ఇప్పుడు కియా డాల్స్ ఈకామర్స్ సైట్లతోపాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్లలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
భారతీయత
ఉట్టిపడేలా..
కియా బొమ్మల ద్వారా శైలజ.. భారతీయ మహిళలు, యువతులు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు. బొమ్మలతో చేసిన ఈ ప్రయత్నం భారతీయతను ఉట్టిపడేలా చేసింది. ఈ బొమ్మలు తయారుచేయడం వెనుక భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పడం.. భవిష్యత్తు తరానికి చెప్పాలన్నది తన ఉద్దేశ్యమంటారు శైలజ. బొమ్మల ద్వారా భారతీయతను కాపాడడమే లక్ష్యమంటారు. భారతీయతను కాపాడుకుంటూ భవిష్యత్తులో గ్లోబల్ స్థాయికి ఎదగాలనేది ఆమె ఆశ. దీనివల్ల పిల్లలకు సరైన సంస్కృతిపై పూర్తి అవగాహన వస్తుందని ఆమె అభిప్రాయం. వివిధ రూపాల్లో భారతీయ సంప్రదాయాలకు దర్పణం పట్టేలా తీర్చిదిద్దాన ఈ బొమ్మలు మహిళల గుర్తింపుకు దోహదపడుతున్నాయి. కియా డాల్స్ భారతీయ మూలాల్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉంటాయంటారు హిమ.
చారిత్రక వ్యక్తులతో సహా
ఝాన్సీరాణి లక్ష్మీబాయి వంటి ఆసక్తికరమైన చారిత్రక వ్యక్తులతో సహా భారతీయను చాటిచెప్పే రూపాల్లో బొమ్మలను తయారుచేశారు. మన కథలు, పురాణాలు, ఇతిహాసాలు.. సంప్రదాయాలకు అనుగుణంగా కియా రూపొందుతోంది. బొమ్మలను మార్కెటింగ్ చేయడానికి రకరకాల వర్క్ షాపులు నిర్వహించి.. కథలు ప్రచురించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.
అనుభవం లేక అనేక ఇబ్బందులు
తగిన అనుభవం, అవగాహన లేకపోవడంవల్ల తొలి రోజుల్లో ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డారు. శైలజా కియా బొమ్మల తయారీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బొమ్మల తయారీలో ఏ అనుభవం లేకపోవడంతోపాటు దిగుమతి, వ్యాపార నిర్వహణలో సమస్యలు వచ్చాయి. వాటిని సవాలుగా తీసుకున్నారు. బొమ్మలు దిగుమతి చేస్తున్న సమయంలో ఏజెంట్లతో సమస్యలు వచ్చాయి. ప్రతికూలత నుంచే అనుభవ పాఠం నేర్చుకున్న హిమ, తర్వాత పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు. మహిళగా శైలజ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. మహిళలకు వ్యాపారం గురించి ఏమీ తెలియదనే భావన నుంచి బయటకు వచ్చి అవకాశాలను కల్పించుకున్నారు. మరికొంతమంది సలహాలు ఇచ్చినా.. ఆమెకు నచ్చిన సూచనలు స్వీకరించి వ్యాపారంలో నిలదొక్కుకున్నారు.
అమెరికాలో అయితే కొత్త రంగంలో రాణిస్తున్నవారికి ప్రచారం ఎక్కువగా ఉంటుంది. అమెరికన్లు చాలా ప్రొఫెషనల్, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. వాటివల్ల మార్కెటింగ్ టెక్నిక్స్ తెలుస్తాయి. నాప్‌కిన్స్ నుంచి బిల్ బోర్డులవరకు ఎలా మార్కెటింగ్ చేయాలనేదానిపై అవగాహన ఉంటుంది. అక్కడ నేర్చుకున్న అనుభవంతో శైలజ సొంత బ్రాండింగ్ పెంచుకునేందుకు అవకాశం దక్కింది. చాలామంది కియా ప్రారంభించడానికి దమ్ము కావాలంటూ అవమానించినవారు ఉన్నారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. కోరిక లేదా కృషితోపాటు నిజాయితీ ఉంటే చివరికి గోల్ చేరుకోవడం కష్టం కాదు అంటారు హిమశైలజ. మంచి పనికి దేవుడు సహాయం చేస్తారని చెప్తారు. నమ్మకం, ఓపికతో ఏ పనైనా సాధించవచ్చని శైలజ తన అనుభవాన్ని పంచుకున్నారు. అందుకే పిల్లలకు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మనోనిబ్బరం చిన్నప్పటి నుంచే ఇవ్వాలంటారు. బొమ్మల ద్వారా భారతీయను ప్రతిబింబించేటట్లు చేయాలనే కొత్త ఆలోచనకు నేనీ స్థాయిలో ఉండడానికి కారణం అంటారు శైలజ.

-హరిచందన