మెయన్ ఫీచర్

‘భావస్వేచ్ఛ’ ముసుగులో భారత విద్రోహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మావతి- అన్న హిందీ చలనచిత్రాన్ని నిర్మించిన ‘సంజయ్‌లీలా బన్సాలీ’ అన్న దర్శకుడు బౌద్ధిక బీభత్సకాండకు ఒడిగట్టినట్టు ఇప్పుడు ధ్రువపడింది. వాస్తవాలను వక్రీకరించి జాతీయ చరిత్రను వికృతపరచడానికి జరిగిన యత్నం బౌద్ధిక బీభత్సకాండ! భౌతికంగా హత్య చేస్తున్నవారికి భౌతిక హత్య చేయడానికి ప్రయత్నించినవారికి ‘భారతీయ శిక్షాస్మృతి’- ఇండియన్ పీనల్ కోడ్- ఐసిసి ప్రకారం శిక్షలను నిర్దేశించి ఉన్నారు. ‘నేర విచారణ విధాన స్మృతి’- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- సిఆర్‌పిసి- సాక్ష్యాల చట్ట- ఎవిడెన్స్ యాక్ట్- నిర్దేశిస్తున్న విధంగా ఈ నేరాలను విచారించి శిక్షిస్తున్నారు. బౌద్ధిక బీభత్సకాండకు పాల్పడిన వారు చరిత్రను హత్య చేస్తున్నారు, జాతీయ సమష్టి మనోభావాలను హత్యచేస్తున్నారు! దేశ విద్రోహాన్ని ప్రోత్సహిస్తున్నారు, సంస్కృతిని హత్య చేస్తున్నారు! కానీ భౌతిక బీభత్సకాండను శిక్షించినట్టుగా బౌద్ధిక బీభత్సకాండను శిక్షించడానికి చట్టాలు ఏర్పడలేదు. భౌతికంగా జరుగుతున్న హత్య దేశానికి వ్యతిరేకమైన ప్రభుత్వానికి వ్యతిరేకమైన నేరం- క్రయిమ్ ఎగైనెస్ట్ ది స్టేట్! కానీ బౌద్ధిక హత్యలు, బౌద్ధిక హత్యా ప్రయత్నాలు ‘భావ స్వాతంత్య్రం’లో భాగమన్న భ్రాంతిని రాజ్యాంగబద్ధంగా వ్యవస్థీకృతం చేయడానికి గుట్టుచప్పుడు కాకుండా కుట్ర జరుగుతోంది! జాతిని, జాతీయ సంస్కృతిని సమాజ సమష్టి చరిత్రను వాస్తవాలను వక్రీకరించి వికృతపరుస్తున్న అక్షర రాక్షసులను చట్టం శిక్షించిన ఉదాహరణలు లేవు! జీవించి ఉన్నవారిని కించపరచినపుడు వారు పరువు నష్టం కలిగించిన వారిపై అభియోగాలు దాఖలు చేయవచ్చు! లేదా గతంలో జీవించినవారిని కించపరచినప్పుడు వారి వారసులు నేర అభియోగాలు దాఖలు చేయవచ్చు! ఇలా భౌతిక హత్యకూ బౌద్ధిక హత్యకూ మధ్య తేడా ఏర్పడి ఉంది! ‘‘భౌతిక హత్య దేశానికి ప్రభుత్వానికి వ్యతిరేకమైన నేరం, బౌద్ధిక హత్య మాత్రం కేవలం వ్యక్తిగత నేరం.. ఇదీ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో వ్యవస్థీకృతమైపోయిన వికృతి..’’!! సమాజ సమష్టి మనోభావాలను జాతీయ సాంస్కృతిక తత్త్వాన్ని హత్యచేస్తున్న తథాకథిత ‘రచయితల’కు, ‘దర్శకులకు’, ‘కళాకారులకు’, చలన చిత్ర నిర్మాతలకు శిక్ష ఏదీ??
భౌతిక హత్య చేయడానికి యత్నించి- అటెంప్ట్ టు మర్డర్- విఫలమైన నేరస్థులను సైతం విచారించి శిక్షించడానికి చట్టాల ప్రకారం వీలుంది! కానీ బౌద్ధిక హత్య చేయదలచి విఫలమైన వారికి ‘శిక్ష’ పడడం లేదు. అందువల్ల మేవాడ్ మహారాణి పద్మావతి - పద్మినీ దేవిని తరతరాల భారతీయులకు స్ఫూర్తి ప్రదాత అయిన మాతృమూర్తిని కించపరచ యత్నించిన నేరానికి దర్శకునికీ, రచయితలకు, నిర్మాతలకు శిక్ష పడదు. ‘అభ్యంతరకరమైన దృశ్యాల’ను ‘కేంద్ర చలన చిత్ర అనుమతి ప్రధాన మండలి’- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేషన్- సిబిఎఫ్‌సివారు తొలగిస్తారు! అంతే! ఈ వికృత దృశ్యాలను- పద్మావతికీ అల్లాఉద్దీన్ ఖిల్జీకి మధ్య వికృత ప్రణయాన్ని కల్పించిన దృశ్యాలను- చిత్రీకరించిన పైశాచిక మానసిక ప్రవృత్తిని ఎవరు శిక్షించాలి!? నిర్మాత, దర్శకుడు, రచయిత- ఈ ముగ్గురూ దుష్టత్రయం! గతంలో ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయిని సౌశీల్యం లేని కులటగా చిత్రీకరించిన వ్రాతలను సంబంధిత ‘గ్రంథం’ నుంచి తొలగించారు, రచయితకు ‘శిక్ష’ పడలేదు.. ఇలా నీచమైన నికృష్టమైన పాశవికమైన పైశాచికమైన అబద్ధాలను పుస్తకాలలోను, చలనచిత్రాలలోను మొదట చొప్పించడం, బాగా ప్రచారం జరిగిన తరువాత తొలగించడం అక్షర మాథ్యమాలలోను దృశ్యమాథ్యమాలలోను దశాబ్దులుగా జరుగుతున్న దేశ వ్యతిరేకమైన జాతీయ సంస్కృతికి వ్యతిరేకమైన కుట్ర.. ఎవరు నిరోధించాలి??
సనాతనమైన అంటే శాశ్వతమైన వాస్తవాలపట్ల, చారిత్రక మహాపురుషుల భరతమాత వరాల బిడ్డల సౌశీల్యం పట్ల కొందరి మస్తకాలలోనైనా సందేహాలను ప్రతిష్ఠించడం బౌద్ధిక బీభత్స రచయితల, దర్శకుల, నిర్మాతల నికృష్ట షడ్యంత్రంలో భాగం! ఇలాంటి అనుమానాలనుండి, అబద్ధాలను తరువాతి కాలంలో ‘వాస్తవాలు’గా ప్రచారం చేయాలన్నది జిహాదీల వ్యూహం, పాశ్చాత్య భావప్రేరితమైన మతం మార్పిడి ముఠాల వ్యూహం, వర్గ విద్వేష, వర్గ కలహ సిద్ధాంత కర్తల పన్నాగం! ‘ప్రపంచీకరణ’ పేరుతో భారతీయులను భగ్నం చేస్తున్న శక్తులు వినూతన పిశాచాలు. దీపం వెలిగించడం హైందవ జాతీయ సంస్కృతి. వాణిజ్య వేదికలపై దీపం వెలిగిస్తున్నట్టు అభినయించే ‘ఘరానా’ పురుషులకు అర్థనగ్నంగా అలంకరించుకున్న యువతులు సహాయం చేస్తుండడం నిరంతర దశ్యమానం అవుతున్న ‘ప్రపంచీకరణ’ వికృతి! 1960వ దశకంలో అమెరికాలోని ఒక సంస్థకు ఒక భారతీయ ‘ఘరానా’ ప్రముఖుడు ‘రిబ్బన్’ కత్తిరించి ప్రారంభోత్సవం చేశాడు. ‘రిబ్బన్’తోపాటు అతగాడు ‘వేలు’ను కూడా కోసుకున్నాడట! ‘‘ఎందుకయ్యా..’’ అని అడిగితే, ‘కత్తెర అందించిన యువతి అందాలను చూస్తూ మైమరచిపోయాను, అందువల్ల వేలు తెంచుకున్నాను..’’ అని ఆ ఘరానా భారతీయుడు నిర్లజ్జగా ప్రకటించాడు. ఈ బౌద్ధిక బీభత్సం గురించి ఆ ఉత్సవానికి అయిష్టంగా హాజరుకావలసి వచ్చిన ప్రముఖ రచయిత రాసీపురం కృష్ణస్వామి నారాయణ్- ఆర్.కె.నారాయణ్- వివరించి ఉన్నాడు!! పాశ్చాత్య ప్రకృతి ప్రపంచీకరణ వికృతిగా మారిన తరువాత ‘భారతీయ మహిళ’ను, మాతృమూర్తిని అర్ధనగ్నంగా సినిమాలలో ప్రదర్శిస్తుండడం నడుస్తోన్న వైపరీత్యం! ‘‘సహస్రంతు పిత్రూన్ మాతా గౌరవేణాతి రిచ్యతే..’’- ‘‘తండ్రి కంటే తల్లి వేయి రెట్లు ఎక్కువగా గౌరవింపతగినది’’ అన్నది భారతీయ జీవన వాస్తవం! ఇపుడు సినిమాలలో, ఏం జరుగుతోంది?? మహిళా సాధికారిత ‘మృగతృష్ణ’లోని ‘మధుర జలం..’!! ఇదీ ‘ప్రపంచీకరణ’ వాస్తవం, విదేశీయుల పెట్టుబడుల బీభత్సం!! ఇలా దుష్టత్రయానికి ‘జిహాదీ’, ‘మతం మార్పిడి’, ‘వర్గకలహం’ మూకలు- వాణిజ్య ప్రపంచీకరణ తోడుకావడంతో ‘దుష్టచతుష్టయం’ సమగ్రమైంది. ‘పద్మావతి’ చిత్రం ప్రతీక! తాత్కాలికం... వాణిజ్య ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకరిస్తున్న భారత వ్యతిరేక వికృతి వౌలిక ప్రాతిపదిక, నిరంతర బీభత్సం...
జేమ్స్.డబ్ల్యు. లరుూనే- అనే అమెరికాకు చెందిన విబుధ దైత్యుడు 2003 జూన్‌లో ప్రచురించిన ‘శివాజీ:హిందూ కింగ్ ఇన్ ఇస్లామిక్ ఇండియా’- శివాజీ. ఇస్లాం భారత్‌లో హిందూ రాజు- అనే ఆంగ్ల గ్రంథాన్ని (2004 జనవరిలో మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఛత్రపతి శివాజీ తల్లిదండ్రులను అవమానించడానికి, తల్లి జిజియాబాయి సౌశీల్యాన్ని అనుమానించడానికి దోహదం చేయగల అబద్ధాలను ఈ పుస్తకంలో ఈ బౌద్ధిక బీభత్సకారుడు కల్పించాడు. కానీ ఆ ఆరు నెలల కాల వ్యవధిలో- పుస్తకం వెలువడినప్పటి నుంచి నిషేధం వరకు ఈ అబద్ధాలను పాఠకులు చదివారు. నిషేధం తరువాత కూడా ‘మహారాష్ట్ర’కు వెలుపల దేశ విదేశాలలో ఈ బీభత్స గ్రంథ పఠనంపై ఆంక్షలు లేవు! చివరికి 2004 ఏప్రిల్‌లో ‘అభ్యంతరకరమైన’ భాగాలను తొలగించడానికి రచయిత అంగీకరించాడు. నిషేధం తొలగిపోయింది.. కానీ ఛత్రపతి జీవితంపై ఆయన తల్లి సౌశీల్యంపై అనుమానాలను కల్పించాలనుకున్న వారి కుట్ర అప్పటికే విజయవంతమైంది. ఇలా బౌద్ధిక హత్య చేసిన ‘లరుూనే’కి శిక్ష పడలేదు! ఈ పుస్తకం వ్రాయడానికంటే నాలుగేళ్లకు ముందే ఈ ‘లరుూనే’ ‘శివాజీ ఇతిహాసం’- ఎపిక్ ఆఫ్ శివాజీ- అన్న మరో ఆంగ్ల పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకంలో కూడా శివాజీ మాతృమూర్తిని కించపరుస్తూ ఇతగాడు అబద్ధాలను వ్రాశాడు. కానీ నాలుగు ఏళ్లపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ అబద్ధాలను పసికట్టలేదు. నాలుగేళ్ళపాటు ఆ మొదటి పుస్తకం మన దేశంలోను విదేశాలలోను అమ్ముడుపోయింది! రెండవ పుస్తకాన్ని నిషేధించిన తరువాత మాత్రమే ఈ మొదటి పుస్తకం సంగతి బయటపడింది.. ఈ ‘లరుూనే’ గాడి స్ఫూర్తితో మన దేశంలోనే పుట్టి పెరిగిన సురేంద్ర నాథ్ సేన్ అనే వాడు ‘ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ది మరాఠాస్’- మహారాష్ట్రుల పాలనా పద్ధతి- అన్న తన ఆంగ్ల గ్రంథంలో శివాజీ తల్లిని నిందించాడట- అది కూడా పెద్ద నిరసన ఉద్యమానికి కారణమైంది! కానీ బౌద్ధిక బీభత్సకారుల లక్ష్యం మాత్రం తాత్కాలికంగా నెరవేరింది.. భారతీయతను హైందవ జాతీయతత్త్వాన్ని భగ్నం చేయడం ఈ లక్ష్యం..
పఠాభి- అనే బౌద్ధిక బీభత్సకారుడు దాదాపు అరవై ఏళ్ల క్రితం ‘్ఫడేల్ రాగాల్ డజన్’ అన్న ‘కవిత’ల సంపుటాన్ని వెలువరించాడు. ఇందులోని ఒక కవితలో ‘రావణుడు తనను పది నోళ్లతో ముద్దుపెట్టుకుంటే తాను పరవశించి పోవాలని’’ రఘురాముని భార్య సీతమ్మ భావించినట్టు ‘పఠాభి’ కల్పించాడు! ఈ బీభత్స గ్రంథాన్ని ప్రభుత్వాలు నిషేధించిన దాఖలా లేదు. ‘‘్ఫడేల్ రోగాల్ డజన్’’ అని చమత్కరించడం తప్ప ‘జాతీయతా నిష్ఠకు’ రచయితలు చేయగలిగినది కూడా ఏమీ లేదు! ‘‘రామాయణం ధ్వంసమైనంత మాత్రన భారతదేశం ధ్వంసం కాదు, సగం మిగిలే ఉంటుంది. మహాభారతం కూడా విధ్వంసమైతే తప్ప భారత విధ్వంసం సమగ్రం కాదు’’- అన్నది దుష్టచతుష్టయం వారి పథకం! కొన్ని ‘మతాలు’ పుట్టకముందు, కొత్త మతాలు విదేశాలనుంచి రాకముందు, అనాదిగా భారత జాతీయ జీవన ప్రస్థాన రథానికి వేదాలు గుర్రాలు, రామాయణం మహాభారతం చక్రాలు!
అందువల్ల మహాభారతాన్ని ధ్వంసం చేయడం కోసం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అనే అభినవ సైంధవుడు నడుం బిగించాడు! ద్వాపర యుగం నాటి పాండవపత్ని ద్రౌపది. పాండవుల మేనమామ కొడుకైన యదుకుల కృష్ణుడు ద్రౌపదికి అన్న! ఈ అన్నాచెల్లెళ్ల మధ్య వికసించిన వాత్సల్యాన్ని ‘యార్లగడ్డ’ వికృతపరచాడు. అన్నా చెల్లెళ్లమధ్య అక్రమ శృంగార బంధాన్ని కల్పించడానికి తన గ్రంథం ద్వారా యత్నించినాడు! ఈ ఘోర పాపానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ఎలాంటి శిక్ష పడలేదు, కేంద్ర ప్రభుత్వం అతగాడిని పద్మ పురస్కారంతో సత్కరించింది.. యార్లగడ్డ చేసింది బౌద్ధిక హత్యాయత్నం..!
‘‘చిన్ని గణపతి తల్లి తొడపై కూచుని పాలు తాగుతున్నాడు. ఒక స్తనం నుండి క్షీరామృతపానం చేస్తుండిన ఆ శిశువు శిశు చాపల్యం కొలదీ అమ్మ వక్షఃస్థలంలోని మరో వైపునున్న రెండవ స్తనంపై చేయి- తొండం- వేశాడు. కానీ రెండవ స్తనం ఉండవసిన చోట పాము హారం వలె వేలాడుతోంది. ఆ పామును తామరతూడుగా భావించిన బుజ్జి గణపతి దాన్ని పట్టుకున్నాడు..’’- అల్లసాని పెద్దన దర్శించిన అద్భుత దృశ్యమిది. మాతా శిశు వాత్సల్య మాధుర్య దృశ్యమిది. అలా పాలు తాగుతుండిన వినాయకునికి పెద్దన ఒక ‘ఉత్పలమాల’ పద్యం ద్వారా అంజలి ఘటించాడు! కానీ ‘కత్తి పద్మారావు’కు ఈ వాత్సల్య దృశ్యంలో ‘వికృత ప్రణయ శృంగారం’ కన్పించిందట! ‘‘అల్లసాని పెద్దనకు ప్రార్థన చేసే సమయంలో సైతం ‘అశ్లీల శృంగారం’ కావలసి వచ్చిందన్న’ది పద్మారావు చేసిన ఆరోపణ. 1980వ దశకం ఆరంభంలో కళాశాల విద్యార్థిగా ఉండిన ఈ ‘వ్యాస రచయిత’ నెల్లూరులో జరిగిన ఒక సభలో పద్మారావు చేసిన ఈ ఆరోపణను విన్నాడు... అల్లసాని వారి పద్యం ఇదీ..
‘‘అంకము చేరి శైలతనయా స్తన
దుగ్ధములానువేళ, బా
ల్యాంక విచేష్ట తొండమున అవ్వలి
చన్ కబళింపబోయి, ఆ
వంక కుచంబు కానక హివల్లభ
హారము కాంచి, వే మృణా
లాంకుర శంక నంటెడు గజాస్యుని
కొత్త అభీష్ట సిద్ధికిన్...’’

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352