తెలంగాణ

మల్లన్నసాగర్ భూ సేకరణపై పిటిషన్ తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మెదక్ జిల్లాలో చేపట్టే మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూ సేకరణకు సంబంధించి 12 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ప్రాజెక్టు కోసం బలవంతంగా భూ సేకరణ జరగదని, రైతుల సమ్మతితోనే భూ సేకరణ చేస్తారని తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందాక హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలని విపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.