జాతీయ వార్తలు

మాల్యా వివరాలు చెప్పాల్సిందే: సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఎక్కడున్నాడో వివరాలు కచ్చితంగా చెప్పితీరాలని అతని లాయర్‌ను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. మాల్యా కేసుపై విచారిస్తున్న ధర్మాసనం కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసింది. మాల్యాకు దేశవిదేశాల్లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయన్న వివరాలను సీల్డుకవర్‌లో బ్యాంకులకు సమర్పించాలని కోర్టు పేర్కొంది. వివిధ బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. మాల్యా భారత్‌కు ఎప్పుడు వస్తారని ధర్మాసనం ప్రశ్నించగా, ఆ విషయం తనకు తెలియదని లాయర్ అన్నపుడు కోర్టులతో పరిహాసాలు వద్దని, అతని ఆచూకీ గురించి వివరాలు చెప్పితీరాలని ధర్మాసనం ఆదేశించింది.