క్రీడాభూమి

సెమీస్‌లో ఓడిన కోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎఐబిఎ ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: రియో డి జెనీరీలో జరుగుతున్న అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ మహిళల 51 కిలోల విభాగంలో భారత బాక్సర్ మేరీ కోమ్ సెసీస్ నుంచి నిష్క్రమించింది. భుజం గాయం కారణంగా సుమారు ఏడాది విశ్రాంతి తీసుకున్న కోమ్‌కు ఇదే తొలి మేజర్ టోర్నీ కావడం విశేషం. కాగా, సెమీస్‌లో వర్జీనియా ఫచ్ చేతిలో ఓడిన కారణంగా కోమ్‌కు కాంస్య పతకం లభించింది. మనోజ్ కుమార్ (64 కిలోలు), సతీష్ కమార్ (ప్లస్ 91 కిలోలు) కూడా తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను చవిచూసి కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు.