జాతీయ వార్తలు
ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మాయావతి అభ్యంతరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 April 2019
లక్నో: సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలపై యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అభ్యంతరం వ్యక్తంచేశారు. మాలేగావ్ కేసుల్లో నిందితురాలైన ప్రజ్ఞాసింగ్ తాను ధర్మయుద్దంలో పాల్గొంటున్నానని, తనను చిత్రహింసలకు గురిచేసిన హేమంత్ కర్కరే సర్వ నాశనమైపోతాడని శపించానని, తన శాపం వల్లే హేమంత్ కర్కరే ఉగ్రవాదుల దాడిలో మరణించాడని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహాం వ్యక్తంచేస్తూ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం నోటీసులు మాత్రమే ఇస్తుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దుచేయటం లేదని మాయావతి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎన్నికల సంఘం స్థాయి దిగజారిపోతుందని ఆరోపించారు.