మహబూబ్‌నగర్

ట్రాక్టర్, లారీ ఢీ: ముగ్గురికి తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, ఏప్రిల్ 12: ట్రాక్టర్, లారీ ఢికొని ముగ్గురుకి తీవ్ర గాయాల పాలైన సంఘటన దేవరకద్ర మండలంలోని గోప్లాపూర్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నచింతకుంట మండలం పర్ధిపూర్ గ్రామానికి చెందిన గడ్డి ట్రాక్టర్ దేవరకద్ర వైపు వెళ్తుండగా బల్లారి నుండి వస్తున్న లారీ వెనుక నుండి ఢీ కొనడంతో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో శ్రీను, మహబూబ్, అంజప్పలను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.