క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలకపల్లి, మార్చి 14: మండల పరిధిలోని దాస్‌పల్లికి చెందిన బల్మూరి రామస్వామిగౌడ్(60) ఆయన భార్య నర్సమ్మ(55) అనే భార్య భర్తలు ఇద్దరు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా తెలకపల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్యగల దాస్‌పల్లి బస్‌స్టేజీ ద్గర తెలకపల్లి నుండి భార్య భర్తలు ఇద్దరు టీవీఎస్ లూనాపై వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలకపల్లి నుండి నాగర్‌కర్నూల్‌కు వెళ్లడానికి వస్తున్న కారు లూనాను ఢీకొట్టింది. దాంతో భార్య భర్తలు ఇరువురిద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అంజయ్య తెలిపారు.