క్రైమ్/లీగల్

పాతళగంగలో మునిగి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, మార్చి 19: ఉగాది సందర్భంగా కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చిన భక్తులు స్నానానికి పాతళగంగలో దిగగా ప్రమాదవశాత్తు శనివారం మునిపోయాడు. ఈగలపెంట ఎస్‌ఐ భద్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చిన వెంకప్ప (28) అనేవ్యక్తి శనివారం స్నానం చేయడానికి తన సహచరులతోపాటు పాతాళగంగలో స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అతని మృతదేహం పాతళగంగ దిగువ 2 కిలోమీటర్ల దూరంలో కనిపించాక పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. చనిపోయిన వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతని స్వగ్రామం కడియాళ్ల కల్లాపూర్, భాగల్‌కోట జిల్లా, కర్ణాటక రాష్ట్రం అని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.