మహబూబ్‌నగర్

మళ్లీ అధికారం టీఆర్‌ఎస్‌దే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మళ్లీ టీ ఆర్ ఎస్ పార్టీయేనని మహబూబ్‌నగర్ తెరాస అభ్యర్థి , తాజా, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ మున్సీపాలిటీ పరిధిలోని 33వవార్డు చిన్నదర్పల్లి గ్రామంలో వివిధ కులసంఘాల నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ప్రస్తుతంన్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికానికి టీఆర్‌ఎస్ పార్టీ అవసరం ఎంతో ఉందని ఆంద్రాపార్టీల జపం చేస్తున్న పార్టీల నాయకుల అవసరం ఏ మాత్రం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడుగడుగున అడ్డుకున్న చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దోస్తి చేయడం తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని విమర్శించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని చైతన్యవంతులు అయ్యారని తెలంగాణ వ్యతిరేక శక్తులను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.