మహబూబ్‌నగర్

జిల్లాలో శాంతిభద్రతలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 31: జిల్లాలో శాంతిభద్రతలు భేష్‌గా ఉన్నాయని అందుకు నిదర్శనం శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరిగిందనిమహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని జిల్లాలో 2018 సంవత్సరంలో శాంతిభధ్రతల విషయంలో రాజీ లేకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేసిందన్నారు. దాంతో జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలను గతంలో కన్నా 50శాతం తగ్గాయని వెల్లడించారు. ముఖ్యంగా జిల్లాలో షీటీంల పనితీరు భేష్‌గా ఉందని తెలిపారు. 2019 సంవత్సరంలో కూడా ప్రెండ్లీ పోలిసింగ్ విధానంతో ముందుకెళ్లడం జరుగుతుందని గ్రామగ్రామాన ప్రత్యేకంగా పోలీసు కళాబృందాలతో చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించుకునేలా పోలీసులు కార్యక్రమాలు చేపట్టనున్నారని పోలీస్‌స్టేషన్ల వారిగా ప్రెండ్లీ పోలిసింగ్ విధానాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. డిజిపి మహేందర్‌రెడ్డి నేతృత్వంలో నూతన ప్రణాళికలు ఆమలు చేయడం వల్ల 2018 సంవత్సరంలో సత్ఫలితాలను అందుకున్నామని జిల్లా పోలీసులకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని మధ్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అదుపులో పెట్టుకుని పలు సూచనలు ఇవ్వాలని నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి విషాదాలు చోటు చేసుకోకుండా ఉండాలని ఆమె కోరారు. పోలీసులు అంటే ప్రజల్లో ఒకరని ఆమె అన్నారు. విలేఖరుల సమావేశంలో ఎఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.