మహబూబ్‌నగర్

శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 1: ప్రజలకు శాంతిభద్రతలను కల్పించడంలో ప్రత్యేకశ్రద్ద ఉంటుందని శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. మంగళవారం 2019నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె కేక్‌ను కట్ చేసి పోలీసులతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. అదేవిధంగా మానసిక వికలాంగులతో కలిసి నూతన సంవత్సర కేక్‌ను కట్ చేసి వారికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు జిల్లా కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో శాంతిభధ్రతల విషయంలో రాజీపడేది లేదని రానున్న పంచాయతీ ఎన్నికలను కూడా పకడ్బందిగా నిర్వహించడంలో పోలీసుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను తరచూ గ్రామాల్లో ఆలజడులకు కారణమయ్యే వారిని గుర్తించి బైండోవర్ చేయడం జరుగుతుందని ఎస్పీ వెల్లడించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులు గ్రామపంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు సేవలు ఎంతో అవసరం అన్నారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు. 2019సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించేలా ఉండాలని ఆ దిశగా పోలీసుల ప్రయత్నం కూడా ఉంటుందన్నారు. గత ఏడాదిలో జరిగిన అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరంలో కూడా ఎలాంటి అలజడులకు తావు ఇవ్వకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది అంతా ఎన్నికల సిజన్ అని పోలీసులు అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎదైన తప్పు జరిగితే పోలీసులపై నేపం నెట్టే అవకాశం ఉంటుందని అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 2019సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో ఉండి మరింత అభివృద్ధి చెంది పోలీసులకు వందశాతం సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అడిషన్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ భాస్కర్, సిఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
తాడూరు, జనవరి 1: మండల కేంద్రమైన తాడూరులో మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన అంపటి శ్రీనివాసులు ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రముఖ న్యాయవాది ఏమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఛత్రపతి విగ్రహాన్ని శ్రీనివాసులు రూ.1.40లక్షలతో నిర్మించి గ్రామంలో ప్రతిష్టించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఛత్రపతి శివాజీ జీవితంలోని ముఖ్య ఘట్టాల గురించి వివరించి, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమయ్య, శ్రీనివాసులు, చంద్రయ్య, వీరాచారి, శివాజీయూత్ బృందం తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులు పూర్తయితేనే బంగారు తెలంగాణ
* రూ.300 కోట్లు ఇస్తే భూసేకరణ పూర్తవుతుంది
* ఏదుల రిజర్వాయర్ పనులు వేగవంతం
* విశ్రాంత ఇంజనీర్ చంద్రవౌళి బృందం
కొల్లాపూర్/ కోడేరు, జనవరి 1: రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు పూర్తయితేనే బంగారు తెలంగాణ అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడుతున్నారని విశ్రాంత ఇంజనీయర్లు తెలిపారు. మంగళవారం మండలంలోని ఎల్లూరు గ్రామపంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఎల్లూరు మొదటి రిజర్వాయర్ దగ్గర సొరంగ పనులను పరిశీలించారు.
నార్లాపూర్‌లోని 8.5టీఎంసీలు నిలువ ఉండే రిజర్వాయర్ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఇంజనీయర్ల ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రవౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, జగదీశ్వర్, ముత్యంరెడ్డి, చంద్రవౌళి, వెంకటేశ్ తదితరులు మాట్లాడుతూ రిజర్వాయర్ పనులలో 44 ఎకరాల భూమి అవసరంకాగా ప్రస్తుతం 10 ఎకరాలు కొని మట్టిని తరలిస్తున్నామని, అదేవిధంగా మరో 34 ఎకరాలలో భూమిని తీసుకొని మట్టిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత ఇంజనీయర్లు, ఏజెన్సీ ప్రతినిధులు తెలిపినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ కావాలంటే ముందుగా ప్రాజక్టులు పూర్తి కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి తగిన నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతోనే తాము కాలేశ్వరం, పాలమూరు రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను పర్యటించి పరిశీలించడం జరుగుతుందన్నారు.
తాము ఇచ్చే నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4 తరువాత ప్రాజెక్టులను సందర్శించి స్వయంగా పరిశీలించి నిధులను కేటాయించడం, త్వరతగతిన పనులు పూర్తి అయ్యేందుకు అన్నీ రకాలుగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఎల్లూరు దగ్గర ఎంజీకేఎల్‌ఐ మిషన్ భగీరథ తదితర పనులు జరుగుతుండటంతో ఎల్లూరు, కొల్లాపూర్ రహదారులు పూర్తిగా పాడైన ఈ రహదారులను మెరుగుపర్చాలని ఎల్లూరు రైతులు విశ్రాంత ఇంజనీయర్లకు వినతిపత్రాన్ని అందచేశారు.
ఏదుల రిజర్వాయర్ వద్ద..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు త్వరతగతిన జరగాలంటే భూసేకరణ ప్రధాన అంశమని ఇందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు తక్షణమే విడుదల చేస్తే ఐదువందల భూసేకరణ పూర్తవుతుందని విశ్రాంత ఇంజనీయర్ల ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రవౌళి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు ఐదుమందితో కూడిన బృందంతో నార్లాపూర్, ఏదుల రిజర్వయర్లు, పంపుహౌజ్‌ల పనులను పరిశీలించిన అనంతరం ఏదుల రిజర్వాయర్ కట్టపై ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బృందం సభ్యులతో కూడి ఆయన మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరిశీలిస్తే నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌజ్ పనులకన్నా ఏదుల రిజర్వాయర్, పంపుహౌజ్ పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు. భూసేకరణ బాగా జరిగిందని ఇంజనీయర్లు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు శ్రద్ద వహించి పనులు చేస్తున్నందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు. నార్లాపూర్ పనులు ఆశించిన వేగంగా జరగడంలేదన్నారు.
గత నెల నుంచి ఈనెల 4 వరకు రాష్ట్రంలోని నిర్మాణ ప్రాజెక్టులను పరిశీలించి పూర్తి స్థాయి నివేదికను ముఖ్యమంత్రికి అందచేస్తామని ఆయన అన్నారు. శ్రీశైలం డ్యాం దగ్గర నీరు లీకేజీ అవుతున్నట్లు తెలిసిందని, అలాగే గుడిపల్లి రిజర్వాయర్ వద్ద నాలుగు మోటార్లను నడిపిస్తే నీరు సరిపోవడంలేదని అంటున్నారని వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట విశ్రాంత ఇంజనీయర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, డి. జగదీశ్వర్, ఎస్.ముత్యంరెడ్డి, టీ. వెంకటేశంలు ఉన్నారు.