మహబూబ్‌నగర్

నారాయణపేట- కోడంగల్ ఎత్తిపోతలను సాధించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జూలై 1: నారాయణపేట- కోడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు సాధనకై ప్రతి ఒక్కరు నడుం బిగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మక్తల్ పట్టణంలో జిపుజాతర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈరందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మక్తల్, నారాయణపేట, కోడంగల్, నియోజకవర్గాలలో బంగారుం పండే భూములున్నా సాగునీరులేక, బీడుగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తతం చేశారు. ఈప్రాంతానికి సాగునీరు, త్రాగునీరుకై జరిగిన పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం నారాయణపేట- కోడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కాగా నేటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరుగున పెట్టిందని ఆయన ఆరోపించారు. పేరపళ్ల జాయమ్మ చెరువు రిజర్వాయర్ కోసం గతంలో అన్ని పార్టీలు ఉద్యమాలు చేశాయని, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 300 కిలోమీటర్ల మేర హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేపట్టి అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌రెడ్డికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈప్రాంతం అభివృద్ధి చెందాలంటే మంజూరైన ప్రాజెక్టును సాధించుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. అందుకు అందరు కలసికట్టుగా రావాలని ఆయన పిలుపునిచ్చారు.