మెదక్

ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, మే 16: ప్రభుత్వ బడులు కాపాడుకునేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేయాలి, 4367 ప్రభుత్వ బడులు మూసేసే ఆలోచన మానుకోవాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పిడిఎస్‌యు, బిడిఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, టిపిటిఎఫ్ ల ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో జెసి పద్మాకర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీకాంత్, తిరుపతిరెడ్డి, ఆనంద్, రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించకపోవడం వల్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, దీన్ని అదునుగా చేసుకొని బడులను మూసేస్తామనడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 21న ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలుగా 10మంది విద్యార్థులు ఉన్న అన్ని పాఠశాలలను సందర్శిస్తామని, ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు.