మెదక్

భక్తజన సంద్రంగా మారిన ఏడుపాయల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని అమ్మవారి ఆలయానికి ఆదివారం రోజు భక్తజనం వెల్లువెత్తింది. ఆలయ ప్రాంగణంలోని షవర్ బాత్‌లు, ఘణపురం ఆనకట్టలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఆలయ పూజారులు పట్టువస్త్రంలో వివిధ రకాల పూలు, పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారు కోటి సూర్యప్రభ కాంతులతో దగదగలాడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. డప్పుచప్పులు...బోనాల ఉరేగింపులు...శివసత్తుల శిగాలు...పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణమంతా హోరెత్తింది. తెలంగాణలోని హైదరాబాద్ జంట నగరాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు వెల్లువల లక్షలాది భక్తులు తరలిరావడంతో విశాలమైన ఏడుపాయల ప్రాంగణం ఎటు చూసిన జనసంద్రమే కనిపించింది. రద్దీ విపరీతంగా ఉండటం, బోనాల ఉరేగింపు నిర్వహించడంతో దుర్గామాత ఆలయానికి వెళ్లెదారి కిటకిటలాడింది. భక్తులు కాలికి గజ్జెలు కట్టి, జుట్టు విరబోసుకొని, నెత్తిపై బోనం ఆపై గండదీపం పెట్టుకొని, ముఖానికి పసుపు వ్రాసుకొని, వేపకొమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు వేసుకొని, చేతిలొ కొరడా పట్టుకొని డప్పుల దరువులకు అనుగుణంగా, లయబద్దంగా నృత్యాలు చేస్తూ ఉరేగింపులుగా వనదుర్గామాత ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు, పోతరాజుల నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించారు. మొక్కుబడుల్లో భాగంగా అనేక మంది భక్తులు దుర్గామాతకు చీర, రవిక, గాజులు సమర్పించి ఓడిబియ్యం పోశారు. కొందరు భక్తులు తలనీలాలు ఇచ్చారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి గొర్రెలు, మేకలు, కోళ్లను బలిచి తమ తమ మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారి కృపతో సంతానం కలగాలని సంతాన గుండంలో దంపతులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలను, తొట్టెల్లను కట్టారు. ఎటు చూసిన ఏడుపాయల జనసంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటి చైర్మన్ పి.విష్ణువర్దన్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావు, ఆలయ డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మలు భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. ఎస్సై సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులను వేగవంతం చేయాలి
* రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ రాంలింగారెడ్డి
మిరుదొడ్డి, డిసెంబర్ 21: డబుల్ బెడ్‌రూం ఇండ్ల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రాంలింగారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల పనులను గురువారంనాడు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులలో నాణ్యత లోపం లేకుండా పనులను చేపట్టాలని కంట్రాక్టర్‌కు సూచించారు. పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా పనులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని కోరారు. పనులను ఏలాంటి లోపాలు వున్న వాటిని గుర్తించాలని అధికారులను అదేశించారు. ప్రతి రోజు అధికారులు పర్యవేక్షిస్తే లోపాలు జరుగుకుండా వుంటాయని పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గొట్టం బైరయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ నంట బాపురెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మైసయ్య, బాగులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.