మెదక్

ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, జూన్ 24: తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ్భావాని అమ్మవారి ఆలయానికి ఆదివారం రోజు భక్తజనం వెల్లువెత్తింది. ఆలయ ప్రాంగణంలోని షవర్ బాత్‌లు, ఘణపురం ఆనకట్టలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఆలయ పూజారులు పట్టువస్త్రంలో వివిధ రకాల పూలు, పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారు కోటి సూర్యప్రభ కాంతులతో దగదగలాడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. డప్పుచప్పులు...బోనాల ఉరేగింపులు...శివసత్తుల శిగాలు...పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణమంతా హోరెత్తింది. తెలంగాణలోని హైదరాబాద్ జంట నగరాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు వెల్లువల లక్షలాది భక్తులు తరలిరావడంతో విశాలమైన ఏడుపాయల ప్రాంగణం ఎటు చూసిన జనసంద్రమే కనిపించింది. రద్దీ విపరీతంగా ఉండటం, బోనాల ఉరేగింపు నిర్వహించడంతో దుర్గామాత ఆలయానికి వెళ్లెదారి కిటకిటలాడింది. భక్తులు కాలికి గజ్జెలు కట్టి, జుట్టు విరబోసుకొని, నెత్తిపై బోనం ఆపై గండదీపం పెట్టుకొని, ముఖానికి పసుపు వ్రాసుకొని, వేపకొమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు వేసుకొని, చేతిలొ కొరడా పట్టుకొని డప్పుల దరువులకు అనుగుణంగా, లయబద్దంగా నృత్యాలు చేస్తూ ఉరేగింపులుగా వనదుర్గామాత ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు, పోతరాజుల నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించారు. మొక్కుబడుల్లో భాగంగా అనేక మంది భక్తులు దుర్గామాతకు చీర, రవిక, గాజులు సమర్పించి ఓడిబియ్యం పోశారు. కొందరు భక్తులు తలనీలాలు ఇచ్చారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి గొర్రెలు, మేకలు, కోళ్లను బలిచి తమ తమ మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారి కృపతో సంతానం కలగాలని సంతాన గుండంలో దంపతులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలను, తొట్టెల్లను కట్టారు. ఎటు చూసిన ఏడుపాయల జనసంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటి, ఈఓ మోహన్‌రావు, ఆలయ డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మలు భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. ఎస్సై సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలి
* కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకుడి ప్రతాప్‌రెడ్డి పిలుపు
తూప్రాన్, జూన్ 24: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాద్యత తెలంగాణ ప్రజలపై ఉందని కాంగ్రెస్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మల్కాపూర్, కోనాయపల్లి, యావాపూర్, వెంకటాయపల్లి, కిష్టాపూర్, గ్రామాలలో పార్టీ జెండావిష్కరణల అనంతరం సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం కోల్పోయిందని ఆమె రుణం తీర్చడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాలలో మార్పు వస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగం, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, రుణాల మాఫీ, అనేక పథకాలు వస్తాయని ఆశించారని గ్రామాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. 70 యేండ్ల పరిపాలనలో 68వేల కోట్లు అప్పులు ఉండగా నాలుగేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో 2లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ ప్రాజెక్టులలో కమీషన్‌లు దండుకున్నారని, కమీషన్‌ల కకృతికి కాంట్రాక్టర్లను ఆంద్రావారికి కాంట్రాక్టు పనులు ఇచ్చారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్ పార్టీని గ్రామాల్లోకి రానివ్వవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2లక్షల రుణం మాఫీ చేస్తామని ప్రతి పెంకుటిల్లు కలిగినవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరీ చేస్తామని ఇయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిదులకు డబ్బులు ఇచ్చి, బ్లాక్‌మేయిల్ చేసి తమ పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శించారు. మల్కాపూర్, వెంకటాయపల్లి, యావాపూర్, కోనాయపల్లి, కిష్టాపూర్‌లలో కార్యకర్తలు బ్యాండ్‌మేలాలు, డప్పుచప్పులు, టపాకాయలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, బూపాల్, ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్‌రెడ్డి, అంజాగౌడ్, అంజియాదవ్ తదితరులు పాల్గొన్నారు.