మెదక్

కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మహా అద్భుతమని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం అన్ని శాఖల జిల్లా అధికారులు, జిల్లా జర్నలిస్టులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. సందర్శనలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం లిప్ట్ ఇరిగేషన్, పంప్‌హౌజ్‌లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, అన్నారం పంప్‌హౌజ్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో ఇలాంటి ప్రాజెక్టును చూడటం తన అదృష్టంగా భావిస్తున్నారని, ఈ ప్రాజెక్టును ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 85వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, ఈ ప్రాజెక్టుతో 4600 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవుతుందని, సుమారు 141 టీఎంసీల నీటి సామార్ధ్యం కలిగి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరగడమే కాకుండా తక్కువ సమయంలో అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించి సాగునీరు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సందర్శనలో అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారు.